LOADING...
UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి 
UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి

UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2023
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఆరుగురు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు కావడంతో ఘోర ప్రమాదం జరిగింది. కారు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళ్తుండగా చాపర్ ప్రాంతంలోని రాంపూర్ క్రాసింగ్ సమీపంలో తెల్లవారుజామున 4 గంటలకు ట్రక్కును ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. కారు ప్రమాదం ఆరుగురు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. వారు ఢిల్లీలోని షహదారా నివాసితులు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నుజ్జునుజ్జు అయ్యిన కారు