NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా
    తదుపరి వార్తా కథనం
    Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా
    ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా

    Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 26, 2024
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు 11 రోజుల పాటు సమ్మె చేశారు.

    అయితే ఈ సమ్మె విరమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓ రెసిడెంట్ డాక్టర్, మెడికల్ డ్రెస్సర్‌పై దాడి జరగడం శోచనీయం.

    దిల్లీలోని కర్కర్‌దూమాలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    శనివారం అర్ధరాత్రి 1 గంటకు తలపై గాయంతో ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడని. గాయానికి కుట్లు వేయడానికి ఆ పేషెంట్ ను డ్రెసింగ్ రూంలోకి తీసుకెళ్లాలని చెప్పారు.

    Details

    ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు

    అయితే కుట్లు వేసే సమయంలో పేషెంట్‌ దుర్భాషలాడి దాడి చేశాడని, పేషెంట్ కుమారుడు కూడా ముఖంపై కొట్టాడని బాధిత రెసిడెంట్‌ డాక్టర్‌ తెలిపారు.

    పేషెంట్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డాక్టర్‌ తెలిపారు.

    భద్రతా ప్రోటోకాల్‌లను పునఃసమీక్షించి, భద్రతను 25శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని ఆసుపత్రులకు ఆదేశించిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

    ఢిల్లీలోని వందలాది రెసిడెంట్ డాక్టర్లు ఆగస్టు 23న తమ సమస్యలను పరిష్కరించి, రక్షణ కల్పించాలని సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా
    దిల్లీ

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    కోల్‌కతా

    మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు  బిహార్
    ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి  తాజా వార్తలు
    Eden Gardens: ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే? ఈడెన్ గార్డన్స్
    'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు  బీజేపీ

    దిల్లీ

    Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం..  పైకప్పు కూలి 6 మందికి గాయాలు   భారతదేశం
    Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలి ఒకరు మృతి; నిలిచిపోయిన విమాన కార్యకలాపాలు  భారతదేశం
    Delhi rain: ఢిల్లీలో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి.. కరెంటు కోతలు,నీటి సరఫరాలో అంతరాయం   భారీ వర్షాలు
    First Fir: కొత్త క్రిమినల్ చట్టం కింద ఢిల్లీలో నమోదైన తొలి కేసు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025