NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు 
    SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు..

    SLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి.

    ప్రమాదం జరిగిన ప్రదేశానికి గురువారం ఉదయం సహాయక బృందాలు అత్యంత సమీపంగా వెళ్లాయి.

    ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి.నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో, టన్నెల్ 14 కిలోమీటర్ల వద్ద ఫిబ్రవరి 22న ప్రమాదం చోటుచేసుకుంది.

    టన్నెల్ బోరింగ్ మెషిన్‌తో పనులు ప్రారంభించగానే, ఒక్కసారిగా భూమి కంపించడంతో సొరంగ మార్గం తీవ్రంగా దెబ్బతిన్నది.

    టన్నెల్ పైభాగం కుప్పకూలడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు.

    ఈ ప్రమాదంలో 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా,మరో 8 మంది ఇప్పటికీ లోపలే చిక్కుకుపోయారు.

    అప్పటి నుంచీ సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి.మట్టికి తడిగా మారడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

    వివరాలు 

    ప్రమాద స్థితి - ఐదు రోజులు గడిచినా మార్పులేదా? 

    ఐదు రోజుల సహాయక చర్యల తర్వాత కూడా లోపల చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల జాడ తెలియలేదు.

    టన్నెల్ లోపల నీరు నిలిచిపోయి, భారీగా పూడిక పేరుకుపోవడంతో శిథిలాలు తొలగించే ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

    సహాయక బృందాలు టన్నెల్‌ను మరింతగా దెబ్బతీయకుండా మట్టిని, నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

    టన్నెల్‌లో ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను తొలగించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.

    అయితే బురద తీవ్రంగా పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.

    అంతేకాకుండా, టన్నెల్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడాన్ని బృందాలు విరమించుకున్నాయి.

    వివరాలు 

    సహాయక బృందాల కృషి - భద్రతా చర్యలు 

    మంగళవారం రాత్రి సహాయక బృందాలు ప్రమాద స్థలానికి 15 మీటర్ల దూరంలో చేరుకున్నాయి.

    అయితే, ఆ ప్రాంతం పూర్తిగా బురద, మట్టితో నిండిపోవడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

    ఆక్సిజన్ సపోర్ట్ లేకపోవడంతో, అక్కడ పనిచేస్తున్న బృందాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

    గురువారం ఉదయం ఆక్సిజన్ సహాయంతో మరింత లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చివరికి 'జీరో పాయింట్' వరకు చేరుకోగలిగాయి.

    అయినప్పటికీ, కార్మికుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

    ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన బురదను తొలగించే పనులు జరుగుతున్నాయి.

    ఈ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడతారనే ఆశతో సహాయక బృందాలు విశ్వాసంతో పనిచేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్

    తెలంగాణ

    Sand Door Delivery: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇసుక డోర్ డెలివరీ భారతదేశం
    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం కేంద్ర ప్రభుత్వం
    Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది  భారతదేశం
    LRS: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంపై ప్రభుత్వ కీలక నిర్ణయం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025