NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి: కోమటిరెడ్డి 
    తదుపరి వార్తా కథనం
    Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి: కోమటిరెడ్డి 
    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి

    Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి: కోమటిరెడ్డి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 13, 2024
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నల్గొండ జిల్లాలో రిజర్వాయర్‌తో పాటు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)సొరంగం పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం తెలిపారు.

    అమెరికాలోని ఒహియోలో టన్నెల్ బోరింగ్ పరికరాలకు పేరుగాంచిన రాబిన్స్ కంపెనీని కంపెనీ సీఈవో లాక్ హోంతో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడారు.

    టన్నెల్ తవ్వకానికి వినియోగించే అధునాతన నిర్మాణ యంత్రాలను లాక్ ప్రదర్శించి,వాటి పనితీరును మంత్రికి వివరించారు.

    సొరంగం తవ్వకానికి వీలైనంత త్వరగా బోరింగ్,కట్టింగ్ స్పేర్ పార్ట్స్ అందించాలని తయారీదారుని మంత్రి అభ్యర్థించారు.

    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తయితే పంపింగ్‌ అవసరం లేకుండా గ్రావిటీ ఫ్లో ద్వారా 3లక్షల ఎకరాలకు, ఉదయ సముద్రం ప్రాజెక్టులో భాగమైన బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు ద్వారా మరో లక్షఎకరాలకు సాగునీరు అందుతుందని వెంకట్‌రెడ్డి తెలిపారు.

    వివరాలు 

    గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లు చెల్లింపులు

    గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు,బేరింగ్ తో పాటు ఇతర రిపేర్లతో ఆగిపోయాయని మంత్రి అన్నారు.

    ఈ ప్రాజెక్టును త్వరగతిన పూర్తి చేసేందుకు.. ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

    బేరింగ్, ఇతర స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా అందిస్తే.. వెంటనే చెల్లింపులు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వివరించారు.

    వివరాలు 

    మంత్రి వివరణతో లాక్ హోం  సంతృప్తి 

    మంత్రి ఇచ్చిన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన లాక్ హోం SLBC టన్నెల్ కు ప్రధాన బేరింగ్, ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను త్వరగానే అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

    మరో రెండు నెలల్లో 7 డయామీటర్ల బేరింగ్, ఇతర స్పేర్ పార్ట్స్ ను షిప్ ద్వారా చెన్నైకి చేర్చుతామని లాక్ హోం తెలిపారు.

    మంత్రి కోమటిరెడ్డి వెంట నల్లగొండ ఇరిగేషన్ శాఖ సీఈ అజయ్ కుమార్, జైప్రకాశ్ అసోసియేట్ కంపెనీ డైరెక్టర్ పంకజ్ గౌర్ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  తెలంగాణ
    Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025