Page Loader
Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌ 
'స్లాట్‌ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌

Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. మొదటి దశలో, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలులోకి తీసుకువచ్చారు. మిగతా కార్యాలయాల్లో ఈ నెలాఖరుకు ముందుగా ప్రణాళిక ప్రకారం దశలవారీగా అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ, పేదలకు న్యాయం కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యాపారులు, ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మరింత సులభతర సేవలు అందించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. ఈ రకమైన నూతన సంస్కరణలు అవినీతికి అవకాశం లేకుండా చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'స్లాట్‌ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌