Smriti Irani : బాస్ తండ్రిని కలిసినప్పుడు.. స్మృతి ఇరానీ పోస్టు వైరల్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani), ఆమె తండ్రి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో ఆమె పంచుకున్నారు. ఆ ఫోటో కి "బాస్ తండ్రిని కలిసినప్పుడు" అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఇరానీ ఈ సమావేశాన్ని స్కూల్లో పేరెంట్-టీచర్ మీటింగ్తో పోల్చారు. 'మన బాస్, మన నాన్న గారు ఒక దగ్గర కూర్చున్నారంటేనే కంగారు వస్తోంది. వారిద్దరూ కలిసి మనపై పోటీ పడి ఫిర్యాదులు చెప్పకూడదని ప్రార్థించాలి. పేరెంట్స్-టీచర్ మీటింగ్ జరుగుతోంది' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
ఇన్స్టాగ్రామ్లో స్మృతి ఇరానీ చేసిన పోస్ట్
ఏక్తా కపూర్,సోనూ సూద్ కామెంట్స్
ఈ పోస్ట్ పై టెలివిజన్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఇరానీ తండ్రిని మెచ్చుకుంటూ కామెంట్ చేశారు. నటుడు సోనూ సూద్ ఇరానీ అంకితభావాన్ని,పెంపకాన్ని మెచ్చుకున్నారు. "ఈ మంచి విద్యార్థికి నా ప్రశంసలు. ఆప్కీ బేటీ బడి మెహనత్ కర్తీ హై, బడి అచ్చి తాలీమ్ ది హై అప్నే (మీ కుమార్తె నిజంగా కష్టపడి పని చేస్తుంది, మీరు ఆమెకు బాగా నేర్పించారు) అంటూ కామెంట్ చేశారు. స్మృతి ఇరానీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X దార తన తండ్రి కోసం తన షెడ్యూల్ నుండి సమయం కేటాయించినందుకు తన "బాస్"కి కృతజ్ఞతలు తెలిపారు. X లో ప్రధాని నరేంద్ర మోదీ ఆమె తండ్రి మరొక ఫోటోను పంచుకున్నారు.