NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ
    తదుపరి వార్తా కథనం
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ

    వ్రాసిన వారు Stalin
    Sep 06, 2023
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది, దాని అజెండాను ఇంకా వెల్లడించలేదు.

    దీంతో సమావేశాల అంజెండాను చెప్పాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నారు.

    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    అలాగే అనేక సమస్యలపై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను మోదీకి తెలియజేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

    కాంగ్రెస్

    'ఇండియా' పేరును రాజ్యాంగం నుంచి తొలగిస్తే ఊరుకోం: కాంగ్రెస్

    అదానీ గ్రూప్‌పై తాజా ఆరోపణలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్ పరిస్థితిపై ప్రత్యేక సమావేశంలో చర్చించాలని ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. అలాగే కాంగ్రెస్ మీటింగ్‌లోనూ చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

    అలాగే దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్ పేరును కేంద్రం మారుస్తుందన్న ఊహాగానాలపై కూడా కాంగ్రెస్ నేతలు తమ సమావేశంలో చర్చించారు.

    జీ20 విందు ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'ఇండియా'కు బదులుగా 'భారత్' అని పేరును చేర్చడంతో దేశంలో వివాదం చెలరేగింది.

    'ఇండియా' పేరును రాజ్యాంగం నుంచి తొలగించే ఏ చర్యనైనా అన్ని జాతీయ పార్టీలు వ్యతిరేకిస్తాయని సమావేశంలో నిర్ణయించింది.

    కాంగ్రెస్

    బీజేపీ ప్రత్యేక అజెండా ఏమిటో దేశానికి చెప్పాలి: గౌరవ్‌ గొగోయ్‌ 

    కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం అనంతరం లోక్‌సభలో పార్టీ ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌ స్పందించారు.

    ఈ సందర్భంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

    బీజేపీ ప్రత్యేక అజెండా ఏమిటో దేశానికి చెప్పాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    ప్రత్యేక సమావేశంలో ఈ అంశం రావచ్చని కొందరు ఊహాగానాలు వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే తప్పకుండా మద్దతు ఇస్తామని సమావేశంలో పాల్గొన్న మరొక నేత చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోనియా గాంధీ
    కాంగ్రెస్
    నరేంద్ర మోదీ
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సోనియా గాంధీ

    'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్ భారతదేశం
    రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది? భారతదేశం
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్

    కాంగ్రెస్

    No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్  ప్రతిపక్షాలు
    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ
    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ రాజస్థాన్
    మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    నరేంద్ర మోదీ

    రాహుల్ గాంధీపై బీజేపీ పాట.. ప్రేమ మనసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు రాహుల్ గాంధీ
    మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు అస్సాం రైఫిల్స్
    పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు పశ్చిమ బెంగాల్
    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు స్వాతంత్య్ర దినోత్సవం

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025