NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!
    అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!

    Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 03, 2025
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన ఐకానిక్‌ టవర్ల పనులపై ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. ఐదు టవర్ల నిర్మాణాన్ని ఐదేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభించేందుకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.

    ఇప్పటికే వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తొలగించారు.

    ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పూర్తిగా బయటపడడంతో, మళ్లీ ఐఐటీ మద్రాసు సివిల్ ఇంజినీరింగ్ నిపుణులతో పరీక్షలు నిర్వహించేందుకు సీఆర్డీఏ లేఖ రాసింది.

    గత ఆగస్టులోనూ ఈ పరీక్షలు నిర్వహించగా, నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు. తుప్పు పట్టిన ఇనుప రాడ్లకు రసాయన తాపడం చేయించి పనులు కొనసాగించవచ్చని సూచించారు.

    Details

     టెండర్ల ప్రక్రియ షురూ 

    తాజా పరిశీలనలో భాగంగా భౌతికంగా టవర్ల స్థితిని పరిశీలించి, కాంక్రీట్ నిర్మాణాలకు కోర్‌కటింగ్‌ టెస్టులు, ఇనుప రాడ్ల నమూనాల పరీక్షలు చేపట్టనున్నారు.

    తుది ఫలితాల ఆధారంగా పనులను పునఃప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

    అవసరమైతే ఎత్తును తగ్గించేందుకు కొత్త నమూనాలు రూపొందించనున్నారు.

    అమరావతి ఐకానిక్ టవర్లలో మొత్తం ఐదు బహుళ అంతస్తులు నిర్మించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ టవర్ల నిర్మాణానికి రూ.2,703 కోట్లతో మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు.

    Details

    పది రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం

    ముఖ్యంగా జేఏడీ టవర్‌ను 47 అంతస్తులతో, మిగిలిన నాలుగు హెచ్‌వోడీ టవర్లను 39 అంతస్తులతో ఫోస్టర్స్‌ సంస్థ డిజైన్ చేసింది.

    అయితే తాజా అంచనాల ప్రకారం వ్యయం రూ.4,687 కోట్లకు పెరిగింది.

    ఐదో టవర్‌కు 70 శాతం, 3, 4 టవర్లకు 78 శాతం, 1, 2 టవర్లకు 71.54 శాతం మేర ఖర్చు పెరిగింది.

    పెరిగిన వ్యయంతోపాటు కొత్త అంచనాలను పరిగణనలోకి తీసుకుని పదిరోజుల్లోనే టెండర్లను పిలిచే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Corona Virus: కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి కరోనా కొత్త కేసులు
    Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ  రవితేజ
    Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌ సచిన్ టెండూల్కర్
    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు

    అమరావతి

    అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు ఆంధ్రప్రదేశ్
    Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్ నారా లోకేశ్
    Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన భారతదేశం
    Andhra pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం .. ఒక్కొక్కరికి రూ.2,000లు..  భారతదేశం
    Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు తెలంగాణ
    Andhra news: అంగన్‌వాడీలకు తీపి కబురు.. గ్రాట్యుటీ అమలుకు ఆమోదం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025