NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Special Trains :రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా,దీపావళికి 1400 ప్రత్యేక రైళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Special Trains :రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా,దీపావళికి 1400 ప్రత్యేక రైళ్లు 
    రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.

    Special Trains :రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా,దీపావళికి 1400 ప్రత్యేక రైళ్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    09:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ మధ్య రైల్వే పండగల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సమయంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణీకుల సౌకర్యం కోసం 1400 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

    అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాల డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రిజర్వేషన్లు నిండిపోతున్నాయి.

    ఈ పరిస్థితిలో ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

    పండుగల సీజన్ లో రద్దీ

    దసరా,దీపావళి సమయంలో రైళ్లు పూర్తిగా రద్దీగా మారుతున్నాయి.ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లి రావడంలో రైళ్లలో ఖాళీలు లేకుండా పోయాయి.

    ప్రైవేట్ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో,దక్షిణ మధ్య రైల్వే అధిక రద్దీ ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

    వివరాలు 

    1400 ప్రత్యేక రైళ్లు 

    తెలుగు రాష్ట్రాల తో పాటు బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువ రైళ్లు నడిపేందుకు డిమాండ్ ఉందని అధికారులు పేర్కొన్నారు.

    ఈ రైళ్లు అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడవనున్నాయి.

    ప్రయాణీకుల పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించనున్నట్లు తెలిపారు.

    ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తూ, రిజర్వ్ చేయని కోచ్ లు కోసం మొబైల్ యాప్‌ యూటీఎస్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు.

    వివరాలు 

    రద్దీ ప్రభావం 

    పండుగ సెలవులు కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి.

    వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో పెరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపుకు వెళ్లే రైళ్లలో పెద్ద రద్దీ కనిపిస్తోంది.

    ఈ రద్దీకి ప్రతిపాదనగా ప్రత్యేక రైళ్లు నడిపినా, ప్రయాణీకులకు వాటి పైన పూర్తి సమాచారం అందడం లేదని తెలుస్తోంది.

    జనరల్ బోగీల్లోకి కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

    రాబోయే రోజుల్లో పండుగల సమయంలో దక్షిణ మధ్య రైల్వే మరింత ప్రత్యేక రైళ్లను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది, తద్వారా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకోనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు అనంతపురం అర్బన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025