NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhogapuram airport: రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం
    తదుపరి వార్తా కథనం
    Bhogapuram airport: రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం
    రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం

    Bhogapuram airport: రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 27, 2025
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

    ప్రథమ దశలో రూ.4,650 కోట్ల వ్యయంతో జీఎమ్మార్‌ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది.

    సంస్థ ప్రకారం 2026 జూన్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా జనవరి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించింది.

    ఎన్‌హెచ్‌16 నుంచి విమానాశ్రయానికి అనుసంధాన రహదారి నిర్మాణానికి భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 60.08 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.

    ఇందులో 20.22 ఎకరాలకు పరిహారం చెల్లించారు. సవరవిల్లి పరిధిలో 39.86 ఎకరాల భూమికి సంబంధించిన రూ.19.89 కోట్ల పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు.

    Details

    సిబ్బంది నివాస సముదాయ నిర్మాణానికి 24.30 ఎకరాలు

    ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాటుకు రావాడ, కవులువాడ ప్రాంతాల్లో 3.13 ఎకరాలను స్వాధీనం చేసుకుని, 0.78 ఎకరాలకు రూ.47.84 లక్షలు చెల్లించారు.

    ఇంకా రూ.3.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ముంజేరు వద్ద ల్యాండ్ పార్శిల్-1 వరకు రోడ్డు నిర్మాణానికి 1.11 ఎకరాలను గత నెలలో రైతులు అప్పగించగా, వారికి రూ.71.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది.

    బసవపాలెం వద్ద విమానాశ్రయ సిబ్బంది నివాస సముదాయం నిర్మాణానికి 24.30 ఎకరాలు కేటాయించారు.

    132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు కోసం 4.50 ఎకరాలను స్వాధీనం చేసుకోగా, ఇందుకు రూ.70.21 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

    Details

    ట్రయన్ రన్ పూర్తి చేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌

    జాతీయ రహదారి నుంచి విమానాశ్రయం వరకు ట్రంపెట్ నిర్మాణానికి 19.75 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.

    ఇందులో భూమి యజమానులకు రూ.14.43 కోట్ల పరిహారం చెల్లించనున్నారు. మిగిలిన భూమికి రూ.22 కోట్ల నిధులు అవసరం.

    ఫేజ్-1లో మార్చి మొదటి వారం నుంచి రోజుకు 1.7 ఎంఎల్‌డీ నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇప్పటికే ట్రయల్‌రన్‌ పూర్తి చేసింది.

    ఫేజ్-2లో 3.3 ఎల్‌ఎండీ అవసరమని జీఎమ్మార్ సంస్థ ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేసింది. దీని కోసం తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయనగరం
    విమానాశ్రయం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    విజయనగరం

    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    విమానాశ్రయం

    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు దిల్లీ
    శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్  హైదరాబాద్
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025