NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్
    తదుపరి వార్తా కథనం
    Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్
    Nitish Kumar: అందుకే 'కూటమి'కి నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్

    Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2024
    01:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ స్థాయిలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి, బిహార్ రాష్ట్ర స్థాయిలో అధికార 'మహాఘట్‌బంధన్'తో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.

    రెండు కూటములను నుంచి తాము వైదొలిగినట్లు నితీష్ కుమార్ పేర్కొన్నారు.

    రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు.

    దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. బీజేపీ, హిందుస్థానీ అవామ్ మోర్చా మద్దతుతో ఆయన మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    రాజీనామా సమర్పించిన తర్వాత నితీష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మహా కూటమితో పాటు ఆర్జేడీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    బిహార్

    కూటమిలో పరిస్థితి బాగా లేదు: నితీష్ 

    'ఏడాదిన్నర క్రితం ఏర్పాటైన మహాఘట్‌బంధన్ కూటమి అస్తవ్యస్తంగా సాగుతోందని నితీష్ కుమార్ పేర్కొన్నారు.

    'మహాఘట్‌బంధన్' (మహాకూటమి)లో పరిస్థితి బాగా లేకపోవడంతో వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నితీష్ చెప్పారు.

    కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రాతిపదికన తాము ఒక్కతాటిపైకి వచ్చినా, అంచనాలను అందుకోవడంలో, విధి నిర్వహణలో విఫలమయ్యామన్నారు.

    ఈ క్రమంలో కొన్ని అంశాల్లో కూటమిలో పార్టీలతో విభేదించామన్నారు. మాట్లాడుకోవడం కూడా తాము మానేసినట్లు వెల్లడించారు.

    అందుకే కూటమితో అన్ని సంబంధాలను తెంచుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.

    కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించాల్సిందిగా నితీష్‌ను గవర్నర్ కోరినట్లు రాజ్ భవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

    బిహార్

    ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదు: నితీష్

    ప్రజలందరి అంగీకారంతోనే తాను మహా కూటమి ప్రభుత్వానికి ముగింపు పలికినట్లు నితీష్ కుమార్ పేర్కొన్నారు.

    ఆర్జేడీ వైఖరి వల్ల.. కూటమిలో పని చేయడంలో ఇబ్బంది ఏర్పడిందన్నారు.

    ప్రతిపక్ష భారత కూటమిలో ఇకపై భాగం కాదని జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.

    కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, హిందుస్థానీ అవామ్ మోర్చాతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.

    త్వరలోనే ఈ దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో పొత్తుకు ముగింపు పలికామన్నారు.

    243 మంది సభ్యులు ఉన్న బిహార్ అసెంబ్లీలో జేడీయూకు 45, బీజేపీకి 78 మంది, 4 హిందుస్థానీ అవామ్ మోర్చా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితీష్ కుమార్
    బిహార్
    తాజా వార్తలు
    ముఖ్యమంత్రి

    తాజా

    CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్
    Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు  బంగ్లాదేశ్
    Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు! రాహుల్ గాంధీ
    Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?  జీవనశైలి

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ బీజేపీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ

    బిహార్

    బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం  సుప్రీంకోర్టు
    బిహార్​లో దారుణం.. ఆస్పత్రిలో రోగిపై తుపాకీ కాల్పులు  భారతదేశం
    బిహార్: ముజఫర్‌పూర్‌లో 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా భారతదేశం

    తాజా వార్తలు

    Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Trump- Biden: న్యూ హాంప్‌షైర్ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ విజయం.. అధ్యక్ష బరిలో ఈ ఇద్దరి మధ్యే పోరు  అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    Mira Road rally: ముంబైలో ఊరేగింపుపై రాళ్లదాడి.. నిందితులపై 'బుల్డోజర్ యాక్షన్' ముంబై

    ముఖ్యమంత్రి

    రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి మహారాష్ట్ర
    ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్ ఉత్తరాఖండ్
    NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి నందమూరి తారక రామారావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025