NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!
    తదుపరి వార్తా కథనం
    China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!
    చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!

    China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 29, 2023
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా(China)లో పిల్లలో శ్వాసకోస(Pneumonia) వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆరు రాష్ట్రాలు తమ ఆరోగ్య మౌలిక సదుపయాలను అలర్ట్ మోడ్‌లో ఉంచాయి.

    రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు శ్వాస సమస్యలపై ఫిర్యాదు చేసే రోగుల సమస్యలను పరిష్కరించడానికి సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని కోరాయి.

    మరోవైపు సీజన్ ఫ్లూ పట్ల పౌరులు అప్రమత్తంగా కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది.

    సీజనల్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

    పరిస్థితులు ఆందోళనకరంగా లేకున్నా, మెడికల్ సిబ్బంది మాత్రం అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది.

    Details

    శ్వాస కోశ కేసులపై నిఘా పెట్టాలన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం

    శ్వాస కోశ కేసులపై నిఘా పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది.

    ఉత్తరాఖండ్ లోని చమోలీ, ఉత్తరకాశీ, పిత్తోర్‌ఘర్ జిల్లాలు చైనా బోర్డర్‌లో ఉండడం గమనార్హం.

    ఇక కోవిడ్ వేళ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల్ని ఇప్పుడు మళ్లీ బలోపేతం చేయనున్నట్లు గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్ చెప్పారు.

    ఉత్తర చైనాలో, ముఖ్యంగా పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల కేసుల పెరుగుతుండటం ఆందోళనలను రేకెత్తిస్తోంది.

    రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లను ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    రాజస్థాన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    చైనా

    G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ జీ20 సమావేశం
    BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ ఇటలీ
    చైనా రక్షణ మంత్రి మిస్సింగ్.. రెండు వారాలుగా అదృశ్యం  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా దిల్లీ

    రాజస్థాన్

    రాజస్థాన్​లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి యూనివర్సిటీ
    రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త మహిళ
    మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు  హర్యానా
    Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి  జైపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025