NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఘటన
    తదుపరి వార్తా కథనం
    Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఘటన
    ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య

    Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఘటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ యువతి తన ప్రేమికుడికి క్షమాపణ చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

    27 ఏళ్ల రాధా ఠాకూర్ అనే యువతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఆమె చాలా రోజులుగా భర్త నుంచి విడిపోయి తన సోదరితో కలిసి జీవిస్తోంది.

    ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి సోదరితో కలిసి భోజనం చేసిన తర్వాత నిద్రకు వెళ్లిన రాధా మరుసటి రోజు ఉదయానికి చనిపోయినట్టు గుర్తించారు.

    ఆమె ఫోన్‌ను పరిశీలించగా కొన్ని ఆడియో రికార్డులు బయటపడ్డాయి. ఆ రికార్డింగ్‌ ప్రకారం ఆమె ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.

    దీంతో రాధా సోదరి అల్కా పోలీసులకు ఫిర్యాదు చేయగా,కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు పెట్టారు.

    వివరాలు 

    ప్రియుడికి క్షమాపణ చెప్పిన ఆడియో

    పోలీసులు విచారణలో రాధా తన ప్రియుడికి క్షమాపణ చెప్పిన ఆడియోను గుర్తించారు.

    ఆ ఆడియోలో రాధా అతనికి క్షమాపణ చెప్పడం, అలాగే అతడి ఫొటో కోరడం వినిపించింది. అయితే అతడు ఫొటో పంపించకపోవడంతో, "గంటలోగా పంపకపోతే ఏమవుతుందో చూడు" అంటూ హెచ్చరించినట్లు ఆ రికార్డింగ్‌లో వెల్లడైంది.

    అనంతరం రాధా మరో ఆడియో రికార్డ్ చేసి తన నిర్ణయాన్ని వివరించింది. ఆమె తన ప్రియుడిని ఉద్దేశించి, "నన్ను క్షమించు, నేను మీ అనుమతి లేకుండా తప్పు చేస్తున్నాను. బాధపడకండి, సంతోషంగా ఉండండి, వివాహం చేసుకోండి. నా మరణాన్ని ఆత్మహత్యగా భావించవద్దు. మీరు సంతోషంగా ఉంటేనే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. పనిలో, జీవితంలో కలతకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాను" అని పేర్కొంది.

    వివరాలు 

    చర్చనీయాంశంగా ఆత్మహత్యలు 

    ఈ ఘటనతో పాటు ఇటీవల బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య నికిత, ఆమె కుటుంబ సభ్యులు పెట్టిన తప్పుడు కేసులతో విసిగి 80 నిమిషాల వీడియో రికార్డ్, 24 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

    ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యలపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో గుజరాత్‌లో రాధా ఘటన మరలా ఆత్మహత్యలపై చర్చనీయాంశంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    గుజరాత్

    Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ  తాజా వార్తలు
    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ  అనంత్ అంబానీ
    Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో  అనంత్ అంబానీ
    Surat: పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా వెళ్లిన కారు.. వీడియో వైరల్  కార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025