NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UttarPradesh: ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
    తదుపరి వార్తా కథనం
    UttarPradesh: ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
    ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి..

    UttarPradesh: ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

    సమాచారం ప్రకారం, ఈ సంఘటన జరిగేటప్పుడు మహాబోధి ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుండి బీహార్‌లోని గయకు ప్రయాణిస్తోంది.

    రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి యమునా బ్రిడ్జి వద్ద ఈ దాడి జరిగింది.

    మిర్జాపూర్ స్టేషన్‌లో రైలు ఆగిపోయి, గాయపడిన ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    వివరాలు 

    దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి

    ఇటీవల, ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ సమయంలో కూడా రాళ్ల దాడి జరిగింది.

    ఈ ఘటనలో ఐదుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్టు చేసింది.

    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (మహాసముంద్) ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ సింగ్ ధాకడ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రైలు విశాఖపట్నం నుండి దుర్గ్‌కు తిరిగి వస్తున్నప్పుడు బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు.

    రైలు దుర్గ్ నుండి ట్రయల్ రన్ కోసం బయలుదేరి, రాయ్‌పూర్ గుండా మహాసముంద్ చేరుకుందని ధాకడ్ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి  భారతదేశం
    Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..   భారతదేశం
    Hathras : పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం..ఎగబడి ప్రాణాలు కోల్పోయిన 116 మంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ? భారతదేశం
    Bhole Baba: భోలే బాబా నేర చరిత్ర ఇదే  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025