Bengaluru: బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బెంగళూరులోని 15 పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఈమెయిల్లో పేర్కొంది. ప్రస్తుతం 15 పాఠశాలల్లో బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం అందిందని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర తెలిపారు. పాఠశాల అధికారులు శుక్రవారం తమకు ఈమెయిల్ అందిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, anti-sabotage బృందాలను పంపారు. వారు వెంటనే పాఠశాల ప్రాంగణం నుండి విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. ఇంకా అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదని పోలీసులు తెలిపారు.
పోలీసులు విచారణకు ఆదేశించిన సీఎం
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భయాందోళనకు గురై పాఠశాలలకు చేరుకున్నారు. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు ఇమెయిల్ లో ఉంది. కమాండ్ సెంటర్ నుండి మాకు కాల్ వచ్చింది,వెంటనే మా బృందాలను నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు తరలించామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కర్ణాటక సిఎం సిద్ధరామయ్య పోలీసులు విచారణకు ఆదేశించారు. పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పాఠశాలలను తనిఖీ చేసి భద్రతను పెంచాలని పోలీసులకు తెలిపినట్లు ఆదేశించారు.