దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు
పార్లమెంట్లో దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నిర్ణయించింది. 2018లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)నుంచి బయటకు వచ్చిన టీడీపీ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీకి లోక్సభలో ముగ్గురు ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా కేంద్రానికి టీడీపీ మద్దతివ్వనుంది. 2018లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా అదే మోదీ సర్కారును బలపర్చడం గమనార్హం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికార పార్టీ వైసీపీ దిల్లీ బిల్లు, అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.