NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!
    ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!

    Supreme Court: ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 18, 2024
    02:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టు చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

    దీనికి సంబంధించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో పలు లోటుపాట్లను సరిదిద్దిన తరువాత త్వరలో అమలులోకి తీసుకురానున్నారు.

    అచ్చంగా రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం మొదలైంది.

    యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ 'సేన vs సేన' కేసుపై జరిగింది.

    మహారాష్ట్రలో శివసేన పార్టీలో శిందే వర్గం తిరుగుబాటు చేయడం,ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి.

    వివరాలు 

    లైవ్ స్ట్రీమింగ్‌ చేయాలని 2018లోనే నిర్ణయం

    శివసేన అసలు తమదేనని ఠాక్రే,శిందే వర్గాలు తారసపడినప్పటికీ, ఈ వ్యవహారంపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.

    సుప్రీంకోర్టు కేసుల లైవ్ స్ట్రీమింగ్‌ చేయాలని 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆచరణలోకి రాలేదు.

    అయితే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి. రమణ పదవీ విరమణ రోజు ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

    ఈ విధంగా సుప్రీంకోర్టు కార్యకలాపాలను లైవ్ స్ట్రీమింగ్ చేయడం మొదలైంది.

    ఆ తరువాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్ స్ట్రీమింగ్‌ చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు.

    ఈ చారిత్రక నిర్ణయం ద్వారా పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి ప్రధానమైన కేసుల విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించగలిగారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ

    సుప్రీంకోర్టు

    Kolkata Doctor Rape and Murder Case: వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు  డివై చంద్రచూడ్
    Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు  ఆళ్ల రామకృష్ణా రెడ్డి
    Kolkata Doctor Murder Case: వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు భారతదేశం
    PMLA: బెయిల్ ఇవ్వ‌డం రూల్‌.. జైలుశిక్ష మిన‌హాయింపు.. పీఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025