NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం
    వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారు సుప్రీం నోటీసులు

    వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 25, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశించింది.

    వాన్‌పిక్‌కు హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై ఈడీ సుప్రీం తలుపు తట్టింది. శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

    ఇప్పటికే 15 ఏళ్లు వృథా అయ్యాయని, దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశం ఇందులో ఇమిడి ఉందని వాన్‌పిక్‌ తరపున న్యాయవాదులు వాదించారు.

    వాన్‌పిక్, రాష్ట్ర ప్రభుత్వం - రస్ అల్ ఖైమాతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అన్నారు. విచారణలో జాప్యం జరుగుతున్నందున ప్రాజెక్టు కదలట్లేదన్నారు.

    DETAILS

    వాన్‌పిక్‌ ప్రాజెక్టు కోసం 22 వేల ఎకరాల భూమిని సేకరించారు

    ఈ మేరకు మొత్తం ప్రాజెక్టు భూములను ఈడీ అటాచ్‌ చేయడం తగదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

    దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా 2008లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర మండలాల్లో వాన్‌పిక్‌ ప్రాజెక్టు కోసం 22 వేల ఎకరాల భూమిని సేకరించారు.

    వాటిల్లో ప్రభుత్వ భూములతో పాటు ఎసైన్డ్‌, పట్టా భూములు సైతం ఉన్నాయి.

    నిజాంపట్నం మండలంలో అత్యధికంగా దాదాపుగా 10 వేల ఎకరాలకు పైగా సేకరణ చేశారు. ఈ నేపథ్యంలోే ఎసైన్డ్‌, పట్టా భూముల రైతులకు పరిహారాన్ని అందజేశారు.

    అయినప్పటికీ వాన్‌పిక్‌ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసులు నమోదు చేయడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా

    సుప్రీంకోర్టు

    ఏపీ రాజధాని అమరావతి కేసును డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు అమరావతి
    ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    వరదలో మునిగిన సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్.. ప్రధాన రహదారుల్లో భారీ టాఫ్రిక్ జామ్ దిల్లీ
    పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    ఆంధ్రప్రదేశ్

    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు విశాఖపట్టణం
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    కడప: చంద్రబాబు రోడ్‌షోలో అగ్నిప్రమాదం చంద్రబాబు నాయుడు
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్

    ప్రభుత్వం

    ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు పశ్చిమ బెంగాల్
    తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్ తెలంగాణ
    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025