NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ
    తదుపరి వార్తా కథనం
    Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ
    Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

    Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 25, 2023
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ- బీమా వైద్య సేవల(IMS) కుంభకోణంలో ఈడీ ఛార్జ్ షీట్‌ దాఖలు చేసింది.

    నాంపల్లిలోని ప్రత్యేక ఈడీ కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేసింది.ఈ మేరకు ప్రధాన నిందితురాలిగా ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 15 మందిని నిందితులుగా పేర్కొంది.

    ఇప్పటికే వీరికి సంబంధించిన రూ.144 కోట్ల భారీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

    వైద్యం చేయకుండానే చేసినట్లుగా,మందులు కొనకుండానే కొన్నట్లుగా చూపించారు.దీంతోపాటు తక్కువ ధరకే ఔషధాలను కొనుగోలు చేసి లెక్కల్లో మాత్రం ఎక్కువగా చూపించారు.

    ఈ నేపథ్యంలోనే పలువురు ఐఎంఎస్‌ అధికారులు భారీ కుంభకోణం చేసినట్లు 2019లోనే ఏసీబీ కేసు నమోదు చేసింది.

    DETAILS

    వివిధ ప్రాంతాల్లో భారీగా కూడబెట్టిన ఆస్తులను కోర్టుకు చూపించిన ఈడీ

    మెడికల్ క్యాంపుల నిర్వహణ, మందులు, సర్జికల్ కిట్ల కొనుగోలులో బీమా వైద్య సేవల(IMS) డైరెక్టర్ గా పనిచేసిన దేవికారాణిపై ఈడీ కొరడా ఝలిపించింది.

    ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారు.

    దేవికారాణి, ఓమ్ని మెడి కంపెనీ ఎండీ శ్రీహరిబాబు సహా మొత్తం 15 మంది కేసులో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. నకిలీ బిల్లులు సృష్టించి రూ.230 కోట్లను సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు ధ్రువీకరించింది.

    కొల్లగొట్టిన డబ్బుతో హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, ఏపీలో నిందితులు భారీగా ఆస్తులు కొన్నట్లు తేలింది.

    97 ప్లాట్లు, 18 వాణిజ్య భవనాలు, 4 ఫ్లాట్లు, 6 విల్లాలు, 6 వ్యవసాయ భూములు ఉన్నాయని, వాటి విలువ రూ.144 కోట్లుగా పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    తెలంగాణ

    ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన గద్దర్
    గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా! గద్దర్
    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట  వనమా వెంకటేశ్వరరావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025