తదుపరి వార్తా కథనం

Karur Stampede: కరూర్లో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు: సుప్రీంకోర్టు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 13, 2025
11:35 am
ఈ వార్తాకథనం ఏంటి
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన (కరూర్ స్టాంపీడ్)పై సీబీఐ దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. మొదట, మద్రాస్ హైకోర్టు సీబీఐ దర్యాప్తును నిరాకరించడంతో, పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ నిర్వహించిన సుప్రీం కోర్టు, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని స్పష్టంగా ఆదేశించింది. అలాగే, దర్యాప్తుపై సమగ్ర పర్యవేక్షణ కోసం, మాజీ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కరూర్లో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు
Supreme Court Orders CBI Investigation Into Karur Stampede; Retired SC Judge To Monitor Probe ! 🔥
— TVK Vijay Trends (@TVKTrendsVijay) October 13, 2025
நீதி வென்றது 🙏 pic.twitter.com/iRwcki7mBM