NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్.. 
    తదుపరి వార్తా కథనం
    SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్.. 
    SupremeCourt: సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్..

    SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 12, 2024
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన వింత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది.

    తన మెదడును నియంత్రించడానికి కొందరు యంత్రాన్ని పెట్టారని, దాన్ని డియాక్టివేట్ చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

    ఈ పిటిషన్‌ను విచారణర్హత లేదని జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ అహసుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసనం తిరస్కరించింది.

    మూడు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈ అంశంపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఈ ఉపాధ్యాయుడు, హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబొరేటరీ (CFSL) నుంచి తీసుకొచ్చిన మెదడు నియంత్రణ యంత్రాన్ని తనపై ప్రయోగించారని ఆరోపించారు.

    ఆ యంత్రాన్ని డియాక్టివేట్ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

    వివరాలు 

    నవంబరు 2022లో రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు 

    ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, సీబీఐ,CFSL‌లకు నోటీసులు జారీ చేసి అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది.

    CFSL తమపై ఎటువంటి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయలేదని స్పష్టం చేస్తూ అఫిడవిట్‌లో పేర్కొంది.

    దాంతో, హైకోర్టు నవంబరు 2022లో ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.

    ఈ ఏడాది సెప్టెంబరు 27న జస్టిస్ సుధాన్షు ధూలియా,జస్టిస్ అహసుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌‌పై కోర్టు విస్తుపోయింది.

    విచిత్రమైన ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది.అయితే పిటిషనర్ సమస్యను అర్థం చేసుకునేందుకు అతని మాతృభాషలో లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా పరస్పర చర్చను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

    వివరాలు 

    ఆ పిటిషన్‌లో జోక్యం చేసుకునే అవకాశం లేదు: సుప్రీం  

    అతనితో మాట్లాడిన తర్వాత సమర్పించిన నివేదిక ప్రకారం, పిటిషనర్ కొందరు వ్యక్తులు తన మెదడును నియంత్రిస్తున్నారని, ఆ పరికరాన్ని డియాక్టివేట్ చేయాలనుకుంటున్నాడని తెలిపింది.

    ధర్మాసనం చివరగా ఆ పిటిషన్‌లో జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఎటువంటి కారణం కనిపించలేదని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌
    AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి ఆంధ్రప్రదేశ్
    Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు టాలీవుడ్
    Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక తృణమూల్ కాంగ్రెస్‌

    సుప్రీంకోర్టు

    Telangana: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం  తెలంగాణ
    Supreme Court: బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇండియా
    Supreme Court: టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ..  భారతదేశం
    Supreme Court: సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌..ఛానల్ లో 'క్రిప్టో' ప్రమోషన్‌ వీడియోలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025