Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ
కేంద్ర మంత్రివర్గం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటుడు సురేష్ గోపీ తీవ్రంగా ఖండించారు. కేరళలోని త్రిసూర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేసిన నటుడు సురేష్ గోపికి కేంద్ర సహాయ మంత్రి పదవిని కేటాయించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో సురేశ్గోపీ సంయుక్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో సినిమాపై దృష్టి సారిస్తానని, సురేశ్ గోపీ మంత్రివర్గానికి రాజీనామా చేస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవి కోరలేదని వార్తలు వచ్చాయి. ఈ అంశం చర్చనీయాంశంగా మారడంతో కేంద్ర మంత్రిగా కొనసాగుతానని సురేష్ గోపీ తన ఎక్స్ పేజీలో స్పష్టం చేశారు.
సురేష్ గోపి చేసిన ట్వీట్
కేరళ ప్రజల ప్రతినిధిగా నేను లోక్సభకు వచ్చినందుకు గర్వంగా ఉంది
తాను రాజీనామా చేస్తానన్న వార్తలు అవాస్తవమని, కేరళ ప్రగతి, అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నానని సురేష్ గోపీ తెలిపారు. కేరళ ప్రజల ప్రతినిధిగా నేను లోక్సభకు వచ్చినందుకు గర్విస్తున్నాను అని సురేష్ గోపి అన్నారు.