NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'
    తదుపరి వార్తా కథనం
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'
    జవాన్లపై నమ్మకం ఉంది, బీజేపీని విశ్వసించలేము: కాంగ్రెస్ నేత రషీద్

    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'

    వ్రాసిన వారు Stalin
    Jan 27, 2023
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2016లో భారత దళాలు జరిపిన సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్‌‌కు మరో హస్తం పార్టీ నాయకుడు రషీద్ అల్వీ మద్దుతుగా నిలిచారు. సర్జికల్ స్ట్రైక్ వీడియోను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

    బీజేపీ ప్రభుత్వం తన వద్ద సర్జికల్ స్ట్రైక్ వీడియో ఉందని చెబుతోంది కాబట్టి దానిని చూపించాలని ప్రభుత్వాన్ని దిగ్విజయ కోరడంలో తప్పేముందని రషీద్ ప్రశ్నించారు.

    'సర్జికల్ స్ట్రైక్'‌పై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని, దాడులకు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెప్పిన మూడు రోజులకే మరో సీనియర్ నేత అందుకు విరుద్ధంగా స్పందించడం గమనార్హం.

    కాంగ్రెస్

    దాడులపై బీజీపీలోని పెద్దల విరుద్ధ ప్రకటనలు: రషీద్

    భారత్ జవాన్లపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసించలేమని రషీద్ అల్వీ అన్నారు.

    సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి బీజేపీ సీనియర్లు, కేంద్రంలోని పెద్దలు విరుద్ధ ప్రకటనలు చేసినట్లు ఆయన చెప్పారు.

    ఎవరూ చనిపోయే అవకాశం లేని ప్రదేశంలో వైమానిక దాడి జరిగిందని సుష్మా స్వరాజ్ మంత్రిగా ఉన్నట్లు స్పందించినట్లు రషీద్ గుర్తు చేశారు. 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అమిత్ షా ఒకసారి చెప్పారని పేర్కొన్నారు. 400 మందికి పైగా హతమయ్యారని యూపీ సీఎం యోగీ మరో సందర్భంలో చెప్పారని అల్వీ వివరించారు.

    నాయకుడిని బట్టి సంఖ్య మారుతూ వస్తోందని అల్వీ ఎద్దేవా చేశారు. కాబట్టి ప్రభుత్వం వీడియో చూపించాలని డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    రాహుల్ గాంధీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025