NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్ 
    టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్

    Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2025
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మొఘల్ కాలంలో నిర్మించబడిన తాజ్‌ మహల్ కు విశేషమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే.

    ఈ శిలా కట్టడాన్ని వీక్షించేందుకు రోజువారీగా వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న ఈ అద్భుత నిర్మాణాన్ని విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ అందమైన కట్టడం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. గత ఐదు సంవత్సరాలలో ఈ అద్భుత కట్టడాన్ని దర్శించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది.

    వివరాలు 

    అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న కట్టడం 

    పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ప్రాచీన కట్టడాల్లో అత్యధికంగా టికెట్ విక్రయాలు జరగుతున్న నిర్మాణంగా తాజ్‌మహల్ మొదటి స్థానంలో ఉంది.

    పర్యాటకుల కోసం టికెట్లు విక్రయించి ఆదాయాన్ని సంపాదిస్తున్న ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిధిలోని కట్టడాల్లో తాజ్‌మహల్ ప్రధాన స్థానాన్ని దక్కించుకున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు.

    రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు.

    గత ఐదు సంవత్సరాలలో పురావస్తు శాఖ పరిధిలోని ప్రదేశాల నుండి టికెట్ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? అనే ప్రశ్నను రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగారు.

    దీనికి స్పందిస్తూ మంత్రి సంబంధిత పురావస్తు కట్టడాల ఆదాయ సమాచారంను సభ ముందు ఉంచారు.

    వివరాలు 

     అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ASI నిర్మాణాలు 

    2019 నుండి 2024 మధ్యకాలంలో పురావస్తు కట్టడాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని సమర్పించిన ఆ వివరాల్లో తాజ్‌మహల్ అగ్రస్థానంలో ఉంది.

    టికెట్ అమ్మకాల ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ASI నిర్మాణాల్లో..

    ఆగ్రా ఫోర్ట్ (ఆగ్రా)

    కుతుబ్ మినార్ (ఢిల్లీ)

    మామల్లపురం (తమిళనాడు)

    సన్ టెంపుల్ (కోణార్క్) ప్రధానంగా ఉన్నాయి.

    తాజ్‌మహల్ చరిత్ర

    17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్, తన ప్రియమైన భార్య ముమ్తాజ్ మహల్ స్మృతిలో యమునా నది తీరాన తాజ్‌మహల్‌ను నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

    ఈ నిర్మాణకౌశలం, అపూర్వ శిల్పకళ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ముందంజలో కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తాజ్ మహల్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    తాజ్ మహల్

    Taj Mahal: భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!  ఆగ్రా
    Mohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు
    Tajmahal: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. చివరికి బూటకమని తేలడంతో ఆగ్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025