NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి 
    తదుపరి వార్తా కథనం
    TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి 
    విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు

    TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 10, 2024
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ సుముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది.

    దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్‌ ముంబయిలో మంగళవారం జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఎన్డీయే అధికారం చేపట్టాక టాటా సంస్థ విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రావడం కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

    ఇప్పటికే పలు ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

    ఇది రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    అనువైన వాతావరణం కారణం 

    ఐటీ రంగ అభివృద్ధికి అనువైన వాతావరణం విశాఖలో ఉండటం కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

    భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.

    దీని వల్ల ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తల రాకపోకలకు మరింత వెసులుబాటు కలుగుతుంది.

    ఇప్పటికే ఇక్కడ టెక్‌మహీంద్రా, సింబయోసిస్‌తో పాటు పలు ప్రముఖ ఐటీ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

    ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'ఏ హబ్‌' పేరిట ఇన్‌క్యుబేషన్‌ కౌన్సిల్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది.

    విశాఖ ఐటీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ దోహదం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

    వివరాలు 

    ఏపీ వైపు ప్రముఖ సంస్థల చూపు 

    రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది.

    ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.లులు,ఓబెరాయ్,బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

    ప్రఖ్యాత ఐటీ కంపెనీల ద్వారా యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని యువగళం పాదయాత్రలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు.

    అందులో భాగంగా టాటా గ్రూపు ఛైర్మన్‌తో సంప్రదింపులు జరిపారు. ముంబయిలోని టాటా సన్స్‌ కార్యాలయం బాంబే హౌస్‌లో ఆ సంస్థల ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేశ్‌ మంగళవారం సమావేశమయ్యారు.

    పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం.. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టీసీఎస్‌ ఛైర్మన్‌కు మంత్రి వివరించారు.

    వివరాలు 

    టాటా గ్రూపు త్వరలో ఒప్పందం

    సమావేశం అనంతరం,విశాఖలో టీసీఎస్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రంలో ఈవీ,ఏరో స్పేస్,స్టీల్,హోటల్స్,పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.

    ఈసందర్బంగా మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

    'విశాఖలో టీసీఎస్‌ సెంటర్‌ ఏర్పాటు ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఆ సంస్థఛైర్మన్‌ అంగీకరించడం సంతోషంగా ఉంది.స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదంతో ప్రముఖ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వాగతిస్తోంది.ఐటీ,ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు టీసీఎస్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి తొలిఅడుగు అవుతుంది'అని లోకేశ్‌ పేర్కొన్నారు.

    టీసీఎస్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో టాటా గ్రూపు త్వరలో ఒప్పందం చేసుకోనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    నారా లోకేశ్
    విశాఖపట్టణం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

    భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం  బిజినెస్
    జనరేటివ్ ఏఐలో ట్రైనింగ్ కోసం టీసీఎస్ పెట్టుబడులు.. లక్ష మంది ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ  బిజినెస్
    TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్  ఉద్యోగులు
    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  టాటా

    నారా లోకేశ్

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: ఏపీలో పోలీసులకు రక్షణ కరువు.. మహిళా పోలీసు డ్రెస్ లాగడంపై మండిపడ్డ చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    విశాఖపట్టణం

    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు రోడ్డు ప్రమాదం
    పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్  ఆంధ్రప్రదేశ్
    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025