NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
    తదుపరి వార్తా కథనం
    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 15, 2023
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో అటవీ భూములు అన్యాక్రాంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు విలువైన భూమిని కాపాడాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.

    ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అల్లంచెర్ల రాజుపాలెంలో అటవీ భూములు కబ్జాలకు గురయ్యాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

    1950 నుంచి సుమారు 3 వేల 255 ఎకరాల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం సదరు శాఖకు తెలియకుండా కొంత భూమిని సాగు భూమిగా ప్రకటించారన్నారు.

    అప్పట్లో రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై పలు కోర్టుల్లో ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయని, సదరు భూమి తమ అధీనంలోనే ఉందని ఆక్రమణదారులు కోర్టుమెట్లెక్కిన విషయాన్ని తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.

    DETAILS

    అవినీతి అధికారులపై కొరడా ఝులిపించాలి : చంద్రబాబు

    అటవీశాఖకు చెందిన భూముల్లో కబ్జాను నియంత్రించి, పూర్వస్థితిని కొనసాగించేందుకు ఉత్తర్వులున్నాయని చంద్రబాబు గుర్తుచేశారు.

    ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేస్తూ, బోరు బావులు తవ్వుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అక్రమ రెవెన్యూ రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములు అన్యక్రాంతం చేసేవారికి ఏపీ సర్కార్ మద్దతిస్తోందన్నారు.

    ఈ విషయంలో కేంద్ర సర్కార్ తక్షణమే జోక్యం చేసుకుని, విలువైన అటవీ సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులు ఏర్పరచాలని సూచించారు.

    ఈ నేపథ్యంలో పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై రాష్ట్ర ప్రభుత్వం సైతం పోరాడాలన్నారు. కబ్జాదారులతో చేతులు కలిపిన అధికారులపై కొరడా ఝులిపించాలని లేఖ ద్వారా కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన ఎన్నికలు
    విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్  వర్షాకాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025