LOADING...
Teachers promotions: టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురూ.. రేపటి నుంచి కౌన్సెలింగ్‌.. 11 నాటికి పూర్తి
టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురూ.. రేపటి నుంచి కౌన్సెలింగ్‌.. 11 నాటికి పూర్తి

Teachers promotions: టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురూ.. రేపటి నుంచి కౌన్సెలింగ్‌.. 11 నాటికి పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ఖాళీలను ప్రకటించి పదోన్నతులు ఇవ్వనున్న ప్రక్రియ మొత్తం 10 రోజుల వ్యవధిలో పూర్తి చేయనున్నారు.

వివరాలు 

పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్‌ విడుదల 

పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రకారం, ఆగస్టు 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTs) స్కూల్‌ అసిస్టెంట్లుగా లేదా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందనున్నారు. అదే విధంగా, స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లుగా పదోన్నతులు లభించనున్నాయి.

వివరాలు 

మొత్తం 3,867 మందికి పదోన్నతులు 

ఈ ప్రక్రియలో మొత్తం 3,867 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందబోతున్నారు. గత సంవత్సరం జూన్‌, జూలై నెలల్లో పదోన్నతులు జరిగిన తర్వాత ఏడాదిలోపే మిగిలిన అర్హులైన వారికి ఈసారి పదోన్నతులు కల్పించనుండటంతో ఉపాధ్యాయ సమాఖ్యలు సంతోషం వ్యక్తం చేశాయి. ఉద్యోగి హక్కుగా భావించే పదోన్నతులు టీచర్లకే కాకుండా విద్యార్థులకు కూడా ఉపయోగపడతాయని గెజిటెడ్ హెచ్‌ఎంల ఫోరమ్ ఫర్ సోషల్ కన్సర్న్ ఛైర్మన్ పర్వతి సత్యనారాయణ తెలిపారు. పెద్ద సంఖ్యలో SGTలు పదోన్నతి పొంది హైస్కూల్‌లకు వెళ్తున్నందున, ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

వివరాలు 

భాషా పండితుల పదోన్నతిపై డిమాండ్ 

మిగిలిపోయిన భాషా పండితుల పోస్టులను కూడా స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతికి పరిగణనలోకి తీసుకోవాలని పండిత పరిషత్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్‌ విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల షెడ్యూల్ వివరాలు: ఆగస్టు 2: వెబ్‌సైట్‌లో ఖాళీల వివరాల ప్రదర్శన ఆగస్టు 3: సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 4: అభ్యంతరాల పరిష్కారం, తుది సీనియారిటీ జాబితా విడుదల ఆగస్టు 6: గెజిటెడ్ హెచ్‌ఎంల పదోన్నతికి స్కూల్‌ అసిస్టెంట్లు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడం ప్రారంభం ఆగస్టు 7: గెజిటెడ్ హెచ్‌ఎంలుగా స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతుల ఉత్తర్వుల జారీ ఆగస్టు 8: ఎస్‌జీటీల తుది సీనియారిటీ జాబితా విడుదల ఆగస్టు 10: స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కోసం ఎస్‌జీటీలు వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

వివరాలు 

పదోన్నతుల వివరాలు (గణాంకాల ప్రకారం): 

ఆగస్టు 11: ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తర్వుల విడుదల గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందేవారు: 902 మంది మల్టీ జోన్ 1: 491 మంది మల్టీ జోన్ 2: 411 మంది స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి: 2,324 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి (PSHM): 641 మంది