NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి 
    తదుపరి వార్తా కథనం
    Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి 
    Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్

    Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 07, 2023
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్ ఎన్నికల బరిలో మరోసారి తీతర్ సింగ్ నిలవనున్నారు. 78 ఏళ్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కార్యకర్త తీతర్ సింగ్ నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

    ఈ మేరకు కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి, తీతర్ సింగ్ ఇప్పటివరకు 20 ఎన్నికల్లో ఓడిపోయారు.

    అయితే ఇన్ని ఏళ్ల నుంచీ ప్రజలు తనని గెలపించకపోయినా మరోసారి పోటీ చేస్తున్నారు. దీనిపై ఆయన స్పందన కోరగా, తాను ఎందుకు ఎన్నికల బరిలో నిలవకూడదు అని బదులిచ్చారు.

    అయితే సింగ్ 1970ల నుంచి రాజస్థాన్‌లో జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేశాడు.బరిలో నిలిచిన ప్రతీసారి డిపాజిట్‌ సైతం గల్లంతయ్యేదన్నారు.

    details

    అందరికీ నిరుపేదలకు భూమి, సౌకర్యాలివ్వాలి : తీతర్ సింగ్ 

    ప్రభుత్వం నిరుపేదలకు భూమి, సరిపడ సౌకర్యాలు ఇవ్వాలన్నదే తన నినాదం అని, ఈ మేరకు ఎన్నికలు అనేవి హక్కుల కోసం పోరాటాలు అని స్పష్టం చేశారు. .

    ప్రజాదరణ కోసం లేదా రికార్డుల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, హక్కులను సాధించుకునేందుకు ఇదో ఆయుధమని స్వత్రంత్ర అభ్యర్థి తీతర్ సింగ్ అన్నారు.

    తాను పంచాయతీ నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేశానని, అయితే ప్రతిసారీ ఓటమిని ఎదుర్కొన్నానన్నారు.

    ఈసారి అదే ఉత్సాహంతో ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు చెప్పారు.

    ఈ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానన్నారు.

    భూమిలేని నిరుపేద కూలీలకు, ప్రభుత్వం భూమిని కేటాయించాలనేది తన డిమాండ్ అని చెప్పుకొచ్చారు.

    details

    సాధారణ రోజుల్లో రైతు కూలీలుగా పనిచేస్తా : తీతర్ సింగ్

    పేదలకు భూమిని కేటాయించాలనే తన డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    దళిత సమాజికవర్గానికి చెందిన తీతర్ సింగ్, తన కుమారులు రోజు వారీ కూలీలుగానే పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

    తనకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారని, మనవళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయన్నారు.

    తన వద్ద డిపాజిట్ నగదు రూ. 2,500 ఉందని, అయితే మరే భూమి, ఆస్తి, వాహనాలు లేవన్నారు.

    సాధారణ రోజుల్లో MGNREGA కింద కూలీగా పని చేస్తానని కానీ ఎన్నికల సమయంలో తన కోసం ప్రచారం చేయడంపై దృష్టి సారిస్తానన్నారు.

    2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లను సింగ్ సాధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    రాజస్థాన్

    ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్‭పోర్ట్ పోలీసులు పాకిస్థాన్
    రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు అత్యాచారం
    పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు ఇండియా
    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025