
Vijayashanti: కాంగ్రెస్లో విజయశాంతికి చీఫ్ కోఆర్డినేటర్గా కీలక బాధ్యతలు
ఈ వార్తాకథనం ఏంటి
విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్లో విజయశాంతికి కీలక పదవి దక్కింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల చీఫ్ కోఆర్డినేటర్గా విజయశాంతిని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయశాంతి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
కాంగ్రెస్లో చేరిన ఒక్క రోజులోనే విజయశాంతికి కీలక పదవి దక్కడం విశేషం.
టాలీవుడ్లో లేడీ అమితాబ్ బచ్చన్గా గుర్తింపు పొందిన విజయశాంతి శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ ట్వీట్
Hon'ble Congress President has approved the proposal for the appointment of Chief Coordinator and Convenors of the Campaign and Planning Committee for the ensuing assembly elections to Telangana - 2023, with immediate effect. pic.twitter.com/5pkcrN7bKs
— Telangana Congress (@INCTelangana) November 18, 2023