NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యే సహా అనుచరులపై అనుమనాలు
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యే సహా అనుచరులపై అనుమనాలు
    హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యేపైనే అనుమనాలు

    హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యే సహా అనుచరులపై అనుమనాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 14, 2023
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్‌కు గురైన సంఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

    ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన భర్త కిడ్నాపయ్యారని తిరుపతి రెడ్డి భార్య సుజాత అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు.

    అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కొంత మంది వ్యక్తులు ఆయన్ను అపహరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    నగరంలోని కుషాయిగూడలో తిరుపతిరెడ్డి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.

    అల్వాల్ పాకాలకుంట పరిధిలో తిరుపతి రెడ్డికి మరి కొంతమందికి గత కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాదాపు 5 వేల 929 గజాల స్థలం విషయంలో వివాదం రాజుకుంది.

    DETAILS

    17 తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించారని తిరుపతి రెడ్డి ఆందోళన

    తమ భూమిని కబ్జా చేసేందుకు పలువురు యత్నిస్తున్నట్లు గతంలోనే తిరుపతి రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన భూమిలో కొందరు వ్యక్తులు కబ్జాకు యత్నిస్తూ అక్రమంగా గోడలు నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఒకే ఫైల్ నెంబర్ మీద 17 తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి కోట్లాది విలువ చేసే భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

    భూ వివాదంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులే తన భర్త తిరుపతిరెడ్డిని అపహరించారని సుజాత ఫిర్యాదు చేశారు.

    గురువారం మధ్యాహ్నం తిరుపతిరెడ్డి డ్రైవర్‌తో కలిసి అల్వాల్ ఎమ్మార్వో ఆఫీసుకెళ్లారు. పని మీద బయటకెళ్లిన కారు డ్రైవర్ తిరిగి వచ్చే సరికి యజమాని కనిపించలేదు.

    DETAILS

    సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల విచారణ 

    ఈ మేరకు ఫోన్ చేయగా, 2 ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన విషయం అంతా తిరుపతిరెడ్డి భార్య సుజాతకు డ్రైవర్ వివరించారు.

    దీంతో తన భర్త కనిపించట్లేదంటూ గురువారం రాత్రే సుజాత అల్వాల్ పోలీసులను ఆశ్రయించింది.

    కిడ్నాప్ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మామిడి జనార్థన్ పై బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    ముక్కెర తిరుపతిరెడ్డి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బకుంటపల్లి గ్రామానికి చెందిన వారు. జనగామ భాజపా టిక్కెట్ ను సైతం ఆశిస్తున్నారు.

    కొద్దిరోజుల క్రితం ఓ భూ వివాదంలో కిడ్నాపై హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య తిరుపతిలు ఒకే మండలానికి చెందినవారు కావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు
    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు యూనివర్సిటీ
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు టీఎస్ఆర్టీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025