Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.
యాసంగి సీజన్లో రైతులు ఇబ్బంది పడకుండా, రైతుబంధు (Rythu Bandhu) నిధులు విడుదలు చేయాలని సంబంధిత అధికారులను సీఎం అదేశించారు.
ఫలితంగా మంగళవారం నుంచి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
సీఎం నిర్ణయంతో సుమారు 70లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
వాస్తవానికి యాసంగి రైతు బంధు నిధులు.. నవంబర్ చివరి వారంలోనే జమ కావాల్సి ఉంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది.
దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఎంఓ ట్వీట్
నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల: సీఎం
— Telangana CMO (@TelanganaCMO) December 11, 2023
రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం శ్రీ @Revanth_Anumula ఆదేశించారు.
వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దాదాపు మూడు గంటల… pic.twitter.com/h9FxL79IXR