NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 
    తదుపరి వార్తా కథనం
    Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 
    మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్

    Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

    వ్రాసిన వారు Stalin
    Oct 09, 2023
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

    నవంబర్ 7నుంచి ఎన్నికల నిర్వహణ ప్రారంభం అవుతుందని ఈసీ వెల్లడించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి.. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.

    తెలంగాణ పోలింగ్ తేదీ: నవంబర్ 30, 2023

    ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.

    మొదటి దశ: నవంబర్ 7, 2023

    రెండో దశ : నవంబర్ 17, 2023

    రాజస్థాన్‌ పోలింగ్ తేదీ నవంబర్ 23, 2023

    మధ్యప్రదేశ్‌ పోలింగ్ తేదీ: నవంబర్ 17, 2023

    మిజోరం పోలింగ్ తేదీ: నవంబర్ 7, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

    5 States Assembly polls | Chhattisgarh to vote on 7th Nov & 17th Nov; Madhya Pradesh on 17th Nov; Mizoram on 7th Nov, Rajasthan on 23rd Nov and Telangana on 30th Nov; Results on 3rd December pic.twitter.com/jV7TJJ9W4A

    — ANI (@ANI) October 9, 2023

    ఎన్నికలు

    తెలంగాణ ఎన్నికల ముఖ్యమైన తేదీలు ఇవే.. 

    తెలంగాణ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

    డిసెంబర్ 5 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు.

    గెజిట్ నోటిఫికేషన్ - నవంబర్ 3, 2023 (శుక్రవారం)

    నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - నవంబర్ 10 (శుక్రవారం)

    నామినేషన్ల పరిశీలన తేదీ - నవంబర్ 13 (సోమవారం)

    అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ - నవంబర్ 15 (బుధవారం)

    పోలింగ్ తేదీ - నవంబర్ 30 (గురువారం)

    కౌంటింగ్ తేదీ - డిసెంబర్ 3 (ఆదివారం)

    ఎన్నిక ప్రక్రియ పూర్తి - డిసెంబర్ 5 (మంగళవారం)

    ఎన్నికలు

    60.2 లక్షల మంది కొత్త ఓటర్లు : సీఈసీ

    ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సహా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

    ఈ ఎన్నికల్లో 60.2 లక్షల మంది మొదటి సారి ఓటు వేయబోతున్నట్లు వెల్లడించారు.

    ఐదు రాష్ట్రాల్లో కలిసి 8.2 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వివరించారు.

    ఐదు రాష్ట్రాలలో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేర్కొన్నారు.

    పారదర్శకతను పెంచడానికి, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి 1.01 లక్షల బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

    ఎన్నికలు

    cVIGIL యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు: సీఈసీ

    ఈ సారి అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో పోలింగ్ జరిగేలా చేసేందుకు ఈసీ చర్యలు తీసుకుంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

    అర్హులైన ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేలా రోల్-టు-పోల్ మార్పిడిపై దృష్టి సారించినట్లు చెప్పారు.

    ఈ రాష్ట్రాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉందన్నారు.

    ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించారు.

    పోలీసులు, ఎక్సైజ్, ఫారెస్ట్ ఏజెన్సీలతో చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    ఫిర్యాదులను చేయడానికి cVIGIL యాప్‌ను ఉపయోగించవచ్చని, 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఛత్తీస్‌గఢ్‌
    అసెంబ్లీ ఎన్నికలు
    ఛత్తీస్‌గఢ్

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    తెలంగాణ

    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్
    అక్టోబర్ 3నుంచి  తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన ఎన్నికల సంఘం
    తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో నారీమణుల జయభేరి.. మహిళలకు భారీగా దక్కనున్న సీట్లు  బీఆర్ఎస్

    ఛత్తీస్‌గఢ్‌

    ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం   ఛత్తీస్‌గఢ్
    కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన ఛత్తీస్‌గఢ్
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత ఛత్తీస్‌గఢ్

    అసెంబ్లీ ఎన్నికలు

    'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్  పవన్ కళ్యాణ్
    నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  కర్ణాటక
    కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఎమ్మెల్యేందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగెస్ పిలుపు కర్ణాటక
    కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్  కాంగ్రెస్

    ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది గణతంత్ర దినోత్సవం
    బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు బీజేపీ
    రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్ ఎయిర్ టెల్
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025