NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు  
    తదుపరి వార్తా కథనం
    Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు  
    భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు

    Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 01, 2023
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో కీలకమైన ఎన్నికల పోలింగ్‌ దశ ముగిసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

    ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈనెల ఆదివారం 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

    ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సెంటర్లను సిద్ధం చేశారు.హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం అవుతున్నాయి.

    మరోవైపు పోలీసులు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు.ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించట్లేదు.

    144 సెక్షన్‌ అమల్లో ఉందని గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

    Details

    రాజధానిలో ఎన్నెన్ని టేబుళ్లు అంటే.. 

    మరోవైపు అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రెఢీ అవుతున్నాయి. 10 నియోజకవర్గాలు మినహా ఒక్కో చోట 14+1 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటవుతున్నాయి.

    కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్‌ కేంద్రాలుండటంతో 20+1 టేబుళ్లు రెఢీ చేస్తున్నారు.

    రాజేంద్రనగర్‌,ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్‌ తదితర 6 నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.ఇక్కడ 28+1 టేబుళ్లు సిద్ధమవుతున్నాయి.

    పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఈసారి ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని ఈసీ వెల్లడించింది.

    ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవ్వాలని యోచిస్తోంది. ఇందుకు 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో 1.80 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఎన్నికల సంఘం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలంగాణ

    IT raids on vivek venkatswamy: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటి రైడ్స్  భారతదేశం
    Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్
    Pawan Kalyan: నేటి నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ వివరాలు ఇవీ..  పవన్ కళ్యాణ్
    Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్?  అసెంబ్లీ ఎన్నికలు

    ఎన్నికల సంఘం

    గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించండి: ఎన్నికల సంఘం  గద్వాల
    ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు
    అక్టోబర్ 3నుంచి  తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన తెలంగాణ
    జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం  జనసేన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025