NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్
    తదుపరి వార్తా కథనం
    Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్
    ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్

    Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 30, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో పోలింగ్ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.

    ఉదయం పది గంటల సమయంలో ఎన్నికల తెలంగాణ కమిషనర్ వికాస్ రాజ్ కుటుంబంతో కలిసి ఓటు వేసేందుకు ఎస్ఆర్ నగర్ పోలింగ్ బూత్'కు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

    రాష్ట్రంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద జనం క్యూలో నిల్చున్నారని వెల్లడించారు. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ భారీగా నమోదవుతోందని చెప్పుకొచ్చారు.

    మరోవైపు నాగార్జున సాగర్ గొడవపై అభ్యర్థులకు, రాజకీయనేతలకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ గొడవ విషయం పోలీసులు చూసుకుంటారని, ఇతరులు ఎవరూ కలగజేసుకోవదన్నారు.

    details

    డ్యామ్ వద్ద ఉద్రిక్తత.. ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు

    ఈ విషయంపై ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే ఏమీ మాట్లాడకూడదని హెచ్చరించారు. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

    దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి చేరుకుని 13వ నెంబర్ గేట్ వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.

    అక్కడి వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ డ్యామ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు. అక్కడున్న సీసీ కెమెరాలతో పాటు ప్రాజెక్టు సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు.

    సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలానికి చేరుకుని ఏపీ పోలీసులతో చర్చించారు,

    ముళ్ల కంచెను తొలగించాలని కోరినా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ససేమిరా వినిపించుకోలేదు.దీంతో టీఎస్ పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగార్జునసాగర్
    ఎన్నికల సంఘం

    తాజా

    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు

    నాగార్జునసాగర్

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు శ్రీశైలం
    మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

    ఎన్నికల సంఘం

    Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఓటు
    నేషనల్ ఐకాన్ గా సచిన్ టెండూల్కర్‌.. కేంద్ర ఎన్నికల సంఘంతో ఒప్పందం సచిన్ టెండూల్కర్
    గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించండి: ఎన్నికల సంఘం  గద్వాల
    ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025