NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
    ఈటలకు వై కేటగిరీ భద్రత

    ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 28, 2023
    07:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ సంచలన ప్రకటన చేసింది.

    ఈటల రాజేందర్ సతీమణి జమన మంగళవారం చేసిన కీలక వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

    రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ సానుకూల చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనపు భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

    ఈటల హత్యకు కుట్రల ఆరోపణల నేపథ్యంలో మంత్రి కేటీఆర్, డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్‌ చేశారు. అనంతరం ఆయన భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో విచారణ జరిపించాలన్నారు.

    ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు భద్రత కల్పించాలని ఆదేశించారు.

    DETAILS

    ఎవరికీ దక్కని ఆమోదం ఒక్క ఈటలకు మాత్రమే దక్కింది

    డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు డీసీపీ సందీప్‌ రావు ఈటల నివాసానికి వెళ్లారు. అక్కడ పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రాజేందర్‌ కుటుంబీకులతో భద్రతపై సమీక్షించారు.

    గతంలోనూ పలువురు పార్టీ ప్రెసిడెంట్లపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌లు ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నారు.ఇక బీజేపీ రాజాసింగ్‌ విషయంలో అనేక బెదిరింపులు వచ్చాయి.

    అడిషనల్ సెక్యూరిటీ కోసం రేవంత్‌, బండి సంజయ్‌, రాజాసింగ్‌, పవన్‌ కల్యాణ్ కోరుకుంటూ దరఖాస్తులు పెట్టుకున్నారు.

    అయితే వీరందరిని పక్కన పెట్టి ఒక్క ఈటలకు మాత్రమే అదనపు భద్రత కల్పించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.రాష్ట్ర ప్రభుత్వ అదనపు భద్రతను ఈటల స్వీకరిస్తారా లేక కేంద్ర భద్రత వైపే మొగ్గుచూపుతారా అనేది తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈటల రాజేందర్
    తెలంగాణ
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    #NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్‌ పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..? ఉమీద్‌ పోర్టల్‌
    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు జమ్ముకశ్మీర్
    Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్! సమంత
    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఈటల రాజేందర్

    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    తెలంగాణ

    కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి
    నైరుతి మరింత ఆలస్యం.. వచ్చే 4 వారాల పాటు రుతుపవనాలు లేవు, వర్షాల్లేవ్ నైరుతి రుతుపవనాలు
    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  మేడ్చల్
    ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025