NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
    అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

    TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 01, 2023
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం తరఫున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో చూసుకుని మరీ ప్రభుత్వం దూసుకెళ్తోంది.

    ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న అంగన్‌వాడీలకు సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు వారిపై వరాల జల్లును కురిపించింది.

    ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీని అంగన్‌వాడీలకు వర్తింపజేయాలని భావించింది. ఈ క్రమంలోనే త్వరలో ప్రకటించనున్న పీఆర్సీేలో అంగన్‌వాడీలనూ చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

    ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్‌ బిల్లులనూ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

    DETAILS

    70 వేల మంది అంగన్‌వాడీలకు లబ్ధి

    తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 70 వేేల మంది అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు లబ్ధి చేకూరనుంది.

    ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీతో ఆదివారం భేటీ అయ్యింది.

    ప్రభుత్వ ఉద్యోగులతో పాటే అంగన్‌వాడీల జీతాలు భారీగా పెంచుతామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.

    మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    తమ డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని అంగన్‌వాడీ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు జమ్ముకశ్మీర్
    Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్! సమంత
    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తెలంగాణ

    తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి  భారీ వర్షాలు
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు  ప్రభుత్వం
    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు  హైదరాబాద్
    తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ కాంగ్రెస్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ తెలంగాణ
    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025