NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Power Purchase: విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
    తదుపరి వార్తా కథనం
    Power Purchase: విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
    విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

    Power Purchase: విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) మరోసారి కష్టాల్లో పడ్డాయి. గురువారం నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయడానికి అనుమతిని నిలిపివేశాయి.

    పవర్ ఎక్స్ఛేంజీలు ఈ నిర్ణయాన్ని తీసుకోగా, ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుకు సంబంధించిన రూ. 261 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన కారణంగా ఈ చర్య జరిగింది.

    ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు బకాయిల గురించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌ (NLDC)కు ఫిర్యాదు చేయడంతో, NLDC తెలంగాణ డిస్కంలను విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకుంది.

    ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    వివరాలు 

    సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించిన తెలంగాణ డిస్కంలు

    గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా విద్యుత్ కొనుగోలులో ఆటంకాలు ఎదురయ్యాయని అధికార వర్గాలు విమర్శలు చేస్తున్నాయి.

    ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్తు అందుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా 1000 మెగావాట్లకు అదనంగా మరొక 1000మెగావాట్ల విద్యుత్తు సరఫరా కోసం కారిడార్‌ను బుక్ చేసింది.

    అయితే, ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్తు అందించలేకపోవడంతో ఈ కారిడార్‌ను రద్దు చేసింది.దీని ఫలితంగా, విద్యుత్ వాడినా వాడకపోయినా పరిహారంగా రూ.261 కోట్లు చెల్లించాలని తెలంగాణ డిస్కంలకు పీజీసీఐఎల్ నోటీసులు పంపించింది.

    ఈ వివాదం నేపథ్యంలో,తెలంగాణ డిస్కంలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించాయి.

    వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉన్నప్పటికీ, తాజాగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్‌ రికార్డు గౌరవం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
    OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్! పవన్ కళ్యాణ్
    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ

    తెలంగాణ

    Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు  ఆంధ్రప్రదేశ్
    Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు భారీ వర్షాలు
    Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ నరేంద్ర మోదీ
    Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025