Page Loader
Telangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2.5 శాతం డీఏను ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2.5 శాతం డీఏను ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వెల్లడించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏను ప్రకటించారు. ఈ డీఏ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై అదనంగా 3.6 కోట్ల రూపాయల భారం పడనుందని తెలిపారు. ఈ పెంపు రేపటి నుండి, అంటే మహిళా దినోత్సవం సందర్భంగా అమలులోకి రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా, రేపు 'ఇందిరా మహిళా శక్తి' బస్సులు ప్రారంభం కానున్నాయి.

వివరాలు 

అద్దె ప్రాతిపదికన 600 బస్సులు 

ప్రారంభ దశలో, మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా 150 బస్సులను అద్దె ప్రాతిపదికన టీఎస్ ఆర్టీసీలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశలో మరో 450 బస్సులను చేర్చుకొని మొత్తం 600 బస్సులను అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకుంది. రేపు ఈ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.