NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

    Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 03, 2025
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇందిరమ్మ ఇళ్లను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

    ఈ క్రమంలో, అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి జాబితాలను సిద్ధం చేశారు.

    మొదటి విడతలో, ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ ఇళ్లను మంజూరు చేశారు.

    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే, ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న 71,480 మందికి ఇళ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు.

    71,480 మందిలో ఇప్పటివరకు 700 మంది ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు.

    ఈ నిర్మాణ ప్రదేశాలను గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ చేశారు.

    ఇళ్ల నిర్మాణ ప్రాంతానికి ముగ్గు వేసిన తరువాత, ఆ ప్రాంత ఫొటోలను, ఆక్షాంశ-రేఖాంశ వివరాలను ప్రత్యేక యాప్‌లో భద్రపరిచారు.

    వివరాలు 

    లబ్ధిదారులకు తొలి విడత నగదు మంజూరుపై ప్రభుత్వం శుభవార్త

    తద్వారా, అధికారుల తనిఖీల సమయంలో, అదే ప్రదేశంలో ఇంటి నిర్మాణం ఉండాల్సిన అవసరం ఉంది.

    లొకేషన్ మారితే, జియో ఫెన్సింగ్ ద్వారా సులభంగా గుర్తించడం సాధ్యమవుతుంది.

    ప్రదేశం మారినప్పుడు, ఆ నిర్మాణం ఫొటో యాప్ లో క్యాప్చర్ కాదు. దీంతో అధికారులు ఆ ఇంటి నిర్మాణాన్ని అనర్హత జాబితాలో చేర్చుతారు.

    అందువల్ల, ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన స్థానంలోనే కొనసాగించాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

    ఇదిలా ఉండగా, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన లబ్ధిదారులకు తొలి విడత నగదు మంజూరు విషయమై ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.

    మొదటి విడతలో ఇళ్లను నిర్మించనున్న లబ్ధిదారులకు త్వరలోనే ఆర్థిక సాయం అందించనుంది.

    వివరాలు 

    రూ. 715 కోట్లు ఇప్పటికే సిద్ధం

    ఈ నెల 15 నాటికి, తొలి విడత సహాయాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇందుకు అవసరమైన రూ. 715 కోట్లు ఇప్పటికే సిద్ధం చేసి, గృహనిర్మాణ శాఖకు కేటాయించనుంది. అనంతరం, ఆ మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడుతుంది.

    ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 25,000 ఇళ్లను మంజూరు చేసింది.

    వీటి కోసం కేంద్రం నుంచి రూ. 375 కోట్లు ఆర్థిక సాయంగా అందనుంది. ఈ నిధులను మార్చి నాటికి పూర్తిగా వినియోగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె

    తెలంగాణ

    Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు  భారతదేశం
    Hydra: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం  భారతదేశం
    Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌ హైదరాబాద్
    Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025