NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు!
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు!
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు!

    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2024
    04:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    16 సంవత్సరాల క్రితం ఉద్యోగ నియామక పరీక్షల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ద్వారా నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించేందుకు ప్రభుత్వం మంగళవారం సిద్ధమైంది.

    ప్రభుత్వ నిర్ణయం ద్వారా సుమారు 2,367 మంది అభ్యర్థులు లబ్ధి పొందనున్నట్లు తెలిసింది. ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో పోస్టులు ఉండనున్నాయి.

    2008 డీఎస్సీ సమయంలో 30% ఎస్జీటీ పోస్టులను డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు కేటాయించడం వల్ల, బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. ఈ నిర్ణయంతో బాధితులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం పోరాడుతున్నారు.

    Details

    అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు నియామకపత్రాలు

    న్యాయస్థానాలు కూడా బాధితులకు న్యాయం చేయాలని తీర్పులిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వారికి న్యాయం చేసే హామీ ఇచ్చింది.

    కొత్తగా నియమించే టీచర్లకు నెలకు రూ.31,030 వేతనం అందుకుంటారు.

    సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

    పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అవసరమైన సర్టిఫికెట్లు, వెరిఫికేషన్ పత్రాలను అందుబాటులో ఉంచారు.

    అదే విధంగా కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు నియామకపత్రాలు గురువారం సాయంత్రం అందించనున్నారు.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ నియామకపత్రాలను పంపిణీ చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    తెలంగాణ

    HYDRA: హైడ్రాకు విస్తృత అధికారాలు.. ఆర్డినెన్స్‌ జారీ చేయనున్న ప్రభుత్వం భారతదేశం
    Revanth Reddy: దిల్లీకి రేవంత్ రెడ్డి.. ఇవాళ మోదీ, అమిత్ షాతో భేటి రేవంత్ రెడ్డి
    Flood damages: రూ.9 వేల కోట్లకుపైనే నష్టం.. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన  భారతదేశం
    Power Purchase: విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ భారతదేశం

    రేవంత్ రెడ్డి

    Job Calendar 2024 : గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ
    Raithu Runamafi: రేపు మూడో విడత రుణమాఫీ.. 14 లక్షల మందికి లబ్ధి కాంగ్రెస్
    Cm Revanth Reddy: 17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం  దిల్లీ
    Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025