Telangana Ration Card: కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. జూలై 14 నుంచి పంపిణీ ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. మొత్తం 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. అర్హులైన వారికి కార్డులు మంజూరు చేసి పంపిణీ చేసే దశలోకి ప్రభుత్వం ప్రవేశించింది. కొందరి పేర్లు ఇప్పటికే పాత కార్డుల్లోకి కూడా ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు, అనర్హుల పేర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, కొత్తగా అంగీకరించిన కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది.
వివరాలు
41 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు
ఇటీవలి సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా, ఈ నెలలోనే 2.4 లక్షల కొత్త కార్డులు లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.30 లక్షల మంది పేద ప్రజలకు ఆర్థిక సహాయంగా ఈ రేషన్ సదుపాయం లభించనుంది.
గత ఆరు నెలల వ్యవధిలోనే 41 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు.
ఈ రేషన్ కార్డుల పంపిణీకి జూలై 14న శుభముహూర్తం ఫిక్స్ చేశారు.
ఆ రోజు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వం పూర్తి చేసింది.
వివరాలు
లబ్ధిదారుల సంఖ్య కూడా 3,14,56,690కి పెరుగుతుంది
ఈ కొత్త పంపిణీతో పాత, కొత్త కార్డులను కలిపి రాష్ట్రంలోని రేషన్ కార్డుల సంఖ్య మొత్తం 94,72,422కి చేరనుంది.
అలాగే లబ్ధిదారుల సంఖ్య కూడా 3,14,56,690కి పెరుగుతుందని అధికారులు తెలిపారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం అయిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లోనూ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది.
ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యపాత్ర పోషించనున్నారు.
ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రకారం, లబ్ధిదారులకు నేరుగా కొత్త కార్డులను అందించనున్నారు.
అందుకోసం స్థానిక అధికారులు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ తేదీల్లో పంపిణీ జరుగుతుందో అధికారికంగా ప్రకటించనున్నారు.
లబ్ధిదారులు ఆ తేదీలకు అనుగుణంగా తమ కార్డులను తీసుకోవచ్చు.
వివరాలు
పాత కార్డుల్లోకి చేరిన కుటుంబ సభ్యుల వివరాలు
కొత్త కార్డులు మంజూరవడమే కాక, పాత కార్డుల్లోకి చేరిన కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు కూడా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం అంగీకరించబడిన కార్డుల ఆధారంగా,కొంతమంది ఇప్పటికే రేషన్ పొందుతున్నారు.
వీరికి శారీరకంగా(ఫిజికల్)కార్డులను అందజేస్తారు. ఇప్పటికే మంజూరైన కార్డుల వివరాలు తెలుసుకోవాలనుకుంటే పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ https://epds.telangana.gov.in/ ద్వారా సులభంగా చూసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో పొందిన రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా వెబ్సైట్లో కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా కనిపిస్తాయి.
వెబ్సైట్లో నెంబర్ ఎంటర్ చేసి, జిల్లా పేరు ఎంచుకుని సెర్చ్ చేస్తే అవసరమైన సమాచారం అందుతుంది.
వెబ్సైట్లో సమాచారం లభించకపోతే, సమీప మండల ఆఫీసులో కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.
వివరాలు
దరఖాస్తు చేయని వారు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఈ సదుపాయం కల్పిస్తామని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు.
అందుకే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
మంజూరైన కార్డులకు సంబంధం లేకుండా, ఇంకా దరఖాస్తు చేయని వారు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.