NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు .. 'నాపై రాళ్లు వేసేవారూ ఉన్నారు'
    తదుపరి వార్తా కథనం
    గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు .. 'నాపై రాళ్లు వేసేవారూ ఉన్నారు'

    గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు .. 'నాపై రాళ్లు వేసేవారూ ఉన్నారు'

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 30, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే లక్ష్యంగా పరోక్షంగా మాట్లాడారు.

    తనపై పువ్వులు వేసే వారు ఉన్నాట్లే, రాళ్లు వేసే వారు కూడా ఉన్నారన్నారు. అందరికీ నచ్చాలనేం లేదన్నారు. మంచి పనులు చేసేందుకు అధికారం ఉండాలన్నారు.

    ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనన్నారు. తనపై రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటానన్నారు.

    పిన్స్‌ విసిరితే రక్తంతోనే తన చరిత్రను పుస్తకంగా రాస్తానన్నారు.

    లోక్‌సభ, శాసనసభలో 33 శాతం మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్న సందర్భంగా రాజ్ భవన్ లో "ధన్యవాదాల కార్యక్రమం నిర్వహించారు.

    ఈ మేరకు గవర్నర్, మహిళల పక్షాన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

    DETAILS

    మహిళలు 20 రెట్లు ఎక్కువ పనిచేస్తేనే గుర్తింపు: గవర్నర్

    మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓ మహిళా రాష్ట్రపతే సంతకం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

    అందరూ ఏదో ఓ కలతోనే రాజకీయాల్లోకి వస్తారన్న గవర్నర్, పురుషులతో పోలిస్తే మహిళలు 20 రెట్లు ఎక్కువగా పని చేస్తే తప్ప గుర్తింపు రావట్లేదన్నారు.

    రాజకీయాలపై ఆసక్తితోనే ఇష్టమైన వైద్యవృత్తిని వదిలిపెట్టాల్సి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    పురుషాధిక్యత పాలిటిక్స్ లో ఎక్కువేనని, దేశంలో దాదాపుగా 15 లక్షల పంచాయతీలకు మహిళలే ప్రెసిడెంట్‌లే ఉన్నారన్నారు.

    గవర్నర్‌గా తెలంగాణకు వచ్చినప్పుడు మహిళా మంత్రే లేరని, పదవి చేపట్టిన రోజు సాయంత్రమే ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారన్నారు.

    తనకు మాత్రం ప్రభుత్వం ప్రోటోకాల్‌ ఇచ్చినా ఇవ్వకున్నా, తన పని తాను చేసుకుంటూ పోతానన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గవర్నర్
    తమిళసై సౌందరరాజన్

    తాజా

    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తమిళసై సౌందరరాజన్

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం గవర్నర్
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్ సుప్రీంకోర్టు
    తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025