NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం 
    హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి

    Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన హైదరాబాద్‌ను ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

    ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక విదేశీ వర్సిటీనైనా హైదరాబాద్‌లో స్థాపించడం ద్వారా మన విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు కల్పించడంతోపాటు నగర బ్రాండ్‌ను మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయమూ, యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యాజమాన్యంతో సమావేశమై హైదరాబాద్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.

    రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలని, అందుకోసం టాప్‌ వర్సిటీల యాజమాన్యాలతో మాట్లాడి క్యాంపస్‌లు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల సీఎం తెలిపారు.

    వివరాలు 

    గత నవంబరులోనే కేంద్రం అనుమతి 

    భారత్‌ నుంచి ప్రతి ఏడాదీ 12లక్షల మంది ఉన్నత విద్య కోసం అమెరికా,ఆస్ట్రేలియా,కెనడా,యూకే, జర్మనీ వంటి దేశాలకు వెళ్తున్నారు.

    వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఈ క్రమంలో విదేశీ వర్సిటీల ప్రాంగణాలను దేశంలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2023 నవంబరులో అనుమతిచ్చింది.

    ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్‌ 500 వర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

    ఈ నేపథ్యంలో దాదాపు 10కిపైగా వర్సిటీలు దరఖాస్తు చేసుకున్నట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి.

    ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్‌ విశ్వవిద్యాలయం అహ్మదాబాద్‌లోని గిఫ్ట్‌ సిటీలో క్యాంపస్‌ ఏర్పాటుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది.

    వివరాలు 

    అనుమతి కోసం ఎదురుచూస్తున్నమలేసియా, కెనడా వర్సిటీలు

    అక్కడ ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లోనే తరగతులు ప్రారంభమయ్యాయి.ఈ ప్రాంగణంలో సైబర్‌ సెక్యూరిటీలో పీజీ కోర్సుకు 3,500 దరఖాస్తులు రావడం విశేషం.

    మన దేశంలో ప్రాంగణాన్ని ప్రారంభించిన తొలి విదేశీ వర్సిటీగా ఇది గుర్తింపుపొందింది.

    ఇటీవల యూకేకు చెందిన సౌతాంప్టన్‌ యూనివర్సిటీ గురుగ్రామ్‌లో క్యాంపస్‌ ఏర్పాటుకు యూజీసీ నుంచి ప్రాథమిక అనుమతి (ఎల్‌ఓఐ) పొందింది.

    మలేసియా, కెనడా వర్సిటీలు సైతం దరఖాస్తు చేసి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.

    వివరాలు 

    రాష్ట్రంపై లింకన్‌ వర్సిటీ ఆసక్తి 

    రాష్ట్రంలో ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు మలేసియాకు చెందిన లింకన్ యూనివర్సిటీ కొద్ది నెలల క్రితం యూజీసీకి దరఖాస్తు చేసింది.

    ఈ యూనివర్సిటీ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో 301-340 పరిధిలో ఉంది.అయితే, యూజీసీ ఇంకా దీనికి అనుమతిని ఇవ్వలేదు.

    హైదరాబాదుకు సమీపంలోని శివార్లలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసే అవకాశముందని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

    ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ),బిట్స్ పిలానీ క్యాంపస్, నల్సార్, ఐఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలతో కూడి హైదరాబాద్ ఇప్పటికే ఒక విద్యా హబ్‌గా మారిపోయింది.

    స్కిల్ యూనివర్సిటీకి కూడా ఇటీవల ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    వీటితో పాటు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు కూడా ఏర్పడితే, హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదగడంలో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    రేవంత్ రెడ్డి

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తెలంగాణ

    Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం .. కీలక అంశాలపై చర్చ రేవంత్ రెడ్డి
    Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా  హైదరాబాద్
    Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత  హైదరాబాద్
    Heavy Rain Alert: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ ఐఎండీ

    తెలంగాణ లేటెస్ట్ న్యూస్

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా హైదరాబాద్
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం కరీంనగర్
    హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్

    రేవంత్ రెడ్డి

    Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం తెలంగాణ
    Revanth Reddy : 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్
    CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన తెలంగాణ
    Telangana: రుణమాఫీ సమస్యలకు చెక్.. రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025