NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
    తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

    Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    09:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిగా సేవలందిస్తున్న జస్టిస్‌ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61) ఆదివారం ఉదయం కన్నుమూశారు.

    కొద్దీ రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

    అంత్యక్రియలు సోమవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    జస్టిస్‌ ప్రియదర్శినీ మృతి పట్ల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోరు పాల్‌, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    Details

    1995లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ప్రియదర్శని 

    1995లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన జస్టిస్‌ ప్రియదర్శిని, విశాఖపట్నంలో సివిల్‌, క్రిమినల్‌, లేబర్‌ లా వంటి అనేక కేసులను వాదించారు.

    అనంతరం 2008 నవంబర్‌లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికై న్యాయ సేవల్లో ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు.

    పదోన్నతితో 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ఆమె సీనియారిటీ ప్రాతిపదికన 16వ స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆమె పదవీ విరమణకు సిద్ధమవ్వాల్సి ఉంది.

    Details

    లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన ప్రియదర్శని

    విశాఖపట్నంలోని ఎన్‌బిఎం లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.

    అంతేకాకుండా సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌ వంటి విభాగాలలో మాస్టర్స్‌ డిగ్రీలు కూడా ఆమె పొందారు.

    జస్టిస్‌ ప్రియదర్శిని, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన మాటూరి అప్పారావు, నాగరత్నం దంపతులకు జన్మించారు.

    ఇంటర్మీడియట్ అనంతరం ఆమె డాక్టర్ కె. విజయ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు భర్త డాక్టర్ కె. విజయ్ కుమార్‌తో పాటు ఇద్దరు కుమారులు నిఖిల్‌, అఖిల్‌ ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైకోర్టు

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    తెలంగాణ

    Telangana: ఆర్టీసీలో భారీగా ఉద్యోగ నియామకాలు.. త్వరలోనే 3,038 పోస్టులకు నోటిఫికేషన్‌ భారతదేశం
    Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! ఆంధ్రప్రదేశ్
    Eco Town: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌.. జపాన్‌ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం భారతదేశం
    Telangana: ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత.. తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన! వాతావరణ శాఖ

    హైకోర్టు

    Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు  తెలంగాణ
    Telangana: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్ కొట్టివేత తెలంగాణ
    Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ అల్లు అర్జున్
    AP High Court: హైకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం.. నలుగురు ఐఏఎస్‌లకు వారెంట్లు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025