NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana elections: 6 సార్ల ఎమ్మెల్యే గడ్డిగారి గడ్డెన్న తెలుసా, ఎన్నికల్లో ఓటేస్తూనే తుదిశ్వాస విడిచారు
    తదుపరి వార్తా కథనం
    Telangana elections: 6 సార్ల ఎమ్మెల్యే గడ్డిగారి గడ్డెన్న తెలుసా, ఎన్నికల్లో ఓటేస్తూనే తుదిశ్వాస విడిచారు
    Telangana: ఆరోజల్లో చదువు లేకున్నా సేవ చేసేవారు..6సార్ల ఎమ్మెల్యే గడ్డిగారి గడ్డెన్న తెలుసా

    Telangana elections: 6 సార్ల ఎమ్మెల్యే గడ్డిగారి గడ్డెన్న తెలుసా, ఎన్నికల్లో ఓటేస్తూనే తుదిశ్వాస విడిచారు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 08, 2023
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో రాజకీయ నాయకులంటే చదవు లేకపోయినా, పెద్ద పెద్ద బారిస్టర్ విద్యలు చదవకపోయినా రాజకీయాల్లో రాణించేవారు.

    ముక్క అక్షరమైనా చదువుకోని వ్యక్తి అయినా పెద్ద పదవులను అలంకరించేవారు. దీని అర్థం రాజకీయాలంటే సేవా భావం అని.

    ఈ మేరకు తెలంగాణలోని ముథోల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డిగారి గడ్డెన్న అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలియని వారుండరు.

    తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డెన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    నిబద్ధతకు మారు పేరుగా నిలిచిన ఈయన్ను ఓసారి మంత్రి పదవే వెతుక్కుంటూ వచ్చింది. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం దేగాంకు చెందిన గడ్డెన్న అసలు పేరు నర్సింహారెడ్డి.

    details

    కాంగ్రెస్‌ పక్షాన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు

    రాజకీయాల్లో గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గడ్డెన్న, సర్పంచిగా గెలిచారు.

    అనంతరం ముథోల్‌ పంచాయతీ సమితి ఛైర్మన్‌గా, భైంసా ఏఎంసీ అధ్యక్షుడిగానూ పని చేశారు. 1967లో ముథోల్‌ ఎమ్మెల్యేగా ఏకగ్రీవమయ్యారు.

    1972, 1977, 1983, 1989, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన ఎమ్మెల్యేగా గెలుపొందారు.1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో బీసీ శాఖ మంత్రిగా హైదరాబాద్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.

    మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్‌ గాంధీలతో సన్నిహిత సంబంధాలున్న గడ్డెన్న, భైంసా సుద్దవాగుపై జలాశయ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.

    2004 ఏప్రిల్‌ 21న ఎన్నికల్లో ఓటేసిన నిమిషాల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన గర్తుగా అప్పటి సీఎం వైఎస్‌ సుద్దవాగు జలాశయానికి గడ్డెన్న పేరునే పెట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు ఆంధ్రప్రదేశ్
    Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్‌ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!   కర్ణాటక
     Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం..  పాకిస్థాన్
    Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం  మధ్యప్రదేశ్

    తెలంగాణ

    BJP: తెలంగాణలో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ  బీజేపీ
    Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..? పురాణాలు ఏం చెబుతున్నాయి! దసరా
    మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం సీరియస్.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ కేంద్ర ప్రభుత్వం
    కేసీఆర్ తీరుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ గెలిస్తే అతనే సీఎం అంట  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025