NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
    మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం

    Telangana: మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 04, 2025
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయానికి పెట్టింది.

    వీటిని మంగళవారం వేలం వేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.ఈ మొత్తంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రభుత్వం తీసుకున్న రుణాలు రూ.67,672 కోట్లకు చేరుకున్నాయి.

    ఈ ఏడాదికి రూ.49,255 కోట్ల రుణాలు సరిపోతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు.పాత బాకీలపై వడ్డీ కిస్తీల కింద రూ.17,729.77 కోట్లు సరిపోతాయని ప్రభుత్వం భావించింది.

    అయితే, ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో (గత ఏప్రిల్ నుంచి జనవరి వరకు)రూ.22,056 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.

    వివరాలు 

    వచ్చే ఏడాదికి రూ.60 వేల కోట్లకు పైగా రుణ లక్ష్యం! 

    ఫిబ్రవరి,మార్చి నెలల్లో వడ్డీ కిస్తీల చెల్లింపులతో ఈ మొత్తం రూ.27 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది.

    ఇక పాత బాకీల అసలు మొత్తం కింద మరో రూ.50 వేల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి.

    పాత బాకీలపై వడ్డీ భారం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎక్కువ రుణాలు సేకరించాల్సి వస్తోందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఈ నెలలో ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభుత్వం కొత్తగా తీసుకునే రుణాల లక్ష్యం రూ.60 వేల కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉంది.

    అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు అవసరమవ్వడం,పాత బాకీల కిస్తీలకు చెల్లింపులు పెరగడం వల్ల రుణాల సేకరణ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

    వివరాలు 

    అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపులో సవాళ్లు 

    పన్నుల ద్వారా ఆదాయం తగినంతగా లభించకపోతే రుణసేకరణ తప్పనిసరిగా పెరగాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నెల (మార్చి)లో కనీసం రూ.18 వేల కోట్ల ఆదాయం లభించవచ్చని అంచనా వేస్తున్నారు.

    జీతాలు, పింఛన్లకు రూ.6 వేల కోట్లు, పాత బాకీల కిస్తీలకు మరో రూ.6 వేల కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి.

    ఈ నేపథ్యంలో అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపులో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు జూబ్లీహిల్స్
    Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్! బాలకృష్ణ
    Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! టాలీవుడ్
    Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం  రింకూ సింగ్

    తెలంగాణ

    SLBC Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుస్తున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన  శ్రీశైలం
    Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ రేవంత్ రెడ్డి
    Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్! ప్రభుత్వం
    SLBC tunnel: అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025