NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్‌
    తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్‌

    Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    08:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2024-25 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

    2009-14 మధ్యకాలంలో యూపీయే ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్లతో పోలిస్తే ఇది 6 రెట్లు ఎక్కువ అని ఆయన వివరించారు.

    రైల్వే అభివృద్ధి గణాంకాలు

    సోమవారం, ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 2014 తర్వాత తెలంగాణలో మొత్తం 753 కి.మీ. కొత్త రైల్వే ట్రాక్‌ను నిర్మించామని, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మొత్తం రైల్వే నెట్‌వర్క్‌తో సమానమని తెలిపారు.

    అదనంగా, రాష్ట్రంలో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని పేర్కొన్నారు.

    వివరాలు 

    వందేభారత్‌ రైళ్లు & రైల్వే స్టేషన్ అభివృద్ధి 

    ఇప్పటి వరకు 453 ఫ్లైఓవర్లు, అండర్‌బ్రిడ్జిలు నిర్మించగా, 62 లిఫ్ట్‌లు, 17 ఎస్కలేటర్లు, 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.

    రూ.39,300 కోట్లతో 2,529 కి.మీ. పొడవైన 22 కొత్త ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. అదనంగా, రూ.1,992 కోట్లతో 40 అమృత్‌ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.

    ప్రస్తుతం 7 జిల్లాల మీదుగా 5 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. అలాగే, రూ.715 కోట్లతో సికింద్రాబాద్, రూ.327 కోట్లతో హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి.

    వివరాలు 

    నూతన ప్రాజెక్టుల ఆమోద విధానం 

    ఒక ప్రశ్నకు సమాధానంగా, గత యూపీయే ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను బడ్జెట్‌లో చేర్చి కేవలం నామమాత్రంగా కేటాయింపులు చేసిందని, దానివల్ల అసలు అభివృద్ధి జరగలేదని మంత్రి అన్నారు.

    కానీ,ప్రస్తుత ప్రభుత్వం ముందుగా సర్వే చేసి, ఆ ప్రాజెక్ట్‌కు వ్యాపారసాద్యత (ఫీజిబిలిటీ) ఉందని నిర్ధారించిన తర్వాతే డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)సిద్ధం చేస్తుందని తెలిపారు.

    ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా,ప్రాజెక్టును ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్,వాణిజ్య శాఖల పరిశీలనకు పంపిన తర్వాత కేబినెట్‌ ఆమోదం కోసం ఉంచుతామని వివరించారు.

    గత జూలై నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.40,000 కోట్ల కొత్త ప్రాజెక్టులను ఆమోదించామని తెలిపారు.

    ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులను ప్రకటించకుండా,సంవత్సరం పొడవునా వాటిని ఆమోదించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    వివరాలు 

    భద్రత & ట్రాక్ మెయింటెనెన్స్‌ 

    ట్రాక్‌ల నిర్వహణ (మెయింటెనెన్స్‌) కోసం కొన్ని రైల్‌స్టాప్‌లను మార్చినట్లు మంత్రి వెల్లడించారు.

    ట్రాక్ కనీసం 3 గంటలు ఖాళీగా ఉంటేనే మెయింటెనెన్స్‌ చేయడం సాధ్యమవుతుందని, రైళ్ల భద్రత కోసం ఇది ఎంతో కీలకమని వివరించారు.

    కవచ్‌ భద్రతా వ్యవస్థ

    తెలంగాణలో 1,326 కి.మీ. మార్గంలో కవచ్‌ భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,011 కి.మీ. మేర పనులు పూర్తయినట్లు వివరించారు. 2024 నుంచి వచ్చే ఆరేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే నెట్‌వర్క్‌కు కవచ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

    కాజీపేట రైల్వే

    యూనిట్ కాజీపేట రైల్వే యూనిట్‌ను మల్టిపుల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే అక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలంగాణ

    Tg Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్.. అర్హుల ఎంపిక ఎలా అంటే..? భారతదేశం
    New Ration cards: జనవరి 26న రేషన్ పండగ.. 6.68 లక్షల కుటుంబాలకు లబ్ధి హైదరాబాద్
    Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి
    Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు భారతదేశం

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025