NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
    తెలంగాణ పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ

    తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో విద్యార్థుల బడి వేళల్లో విద్యాశాఖ కీలక మార్పులను నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు ఉత్తర్వులు జారీ చేసింది.

    నూతన వేళల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పనిచేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి.

    మరోవైపు ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించింది. ఉన్నత పాఠశాలల సమయ వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపింది.

    బడి వేళల మార్పుపై గత కొద్దికాలంగా పాఠశాల విద్యాశాఖకు అనేక ఫిర్యాదులు, సలహాలు, సూచనలు వెల్లువెత్తాయి.

    DETAILS

    ఇకపై ప్రాథమిక, ఉన్నత విద్యార్థులకు ఉదయం 9.30కే తరగతులు ప్రారంభం

    ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులు కాబట్టి ఉదయం త్వరగా నిద్రలేవలేరనే నేపథ్యంలో కీలక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వివరించింది. మారిన బడి వేళల నేపథ్యంలో ఉదయం 9.30గంటలకు తరగతులు మొదలవుతాయి.

    ఉన్నత పాఠశాలల్లో కాస్త ఎదిగిన పిల్లలు ఉంటారు కనుక ఉదయం 9గంటలకే పాఠశాలలు మొదలు కావాల్సి ఉంది. కానీ 9.30 గంటలకు తరగతులు ప్రారంభమవుతున్నాయి.

    ప్రస్తుతం ఉన్నత పాఠశాలల బడి వేళలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విద్యాశాఖ దృష్టికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నత పాఠశాలల మాదిరే ప్రాథమిక పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

    తాజా ఉత్తర్వులు సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తాయని ఉత్తర్వులో విద్యాశాఖ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్
    ప్రభుత్వం

    తాజా

    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త

    తెలంగాణ

    రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ   నైరుతి రుతుపవనాలు
    మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు  హైకోర్టు
    తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలు.. 10 వేలకు చేరువలో మెడికల్ సీట్లు ప్రభుత్వం
    తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. 14,565 సీట్లకు గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం

    హైదరాబాద్

    హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం దిల్లీ
    ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్  సాఫ్ట్ వేర్
    పెళ్లి చేసుకోమ్మన్నందుకు యువతిని చంపి మ్యాన్‌హోల్‌లోకి తోసేసిన ప్రియుడు  హత్య
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    ప్రభుత్వం

    తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్ తెలంగాణ
    సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం తెలంగాణ
    టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్​, పాన్​ కార్డు వివరాలు అవుట్ టెలిగ్రామ్
    ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025