NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ పీఠంపై తొలి దళిత స్పీకర్..బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్
    తదుపరి వార్తా కథనం
    Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ పీఠంపై తొలి దళిత స్పీకర్..బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్
    బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్

    Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ పీఠంపై తొలి దళిత స్పీకర్..బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 14, 2023
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    ఈ మేరకు ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

    ఈ సందర్భంగా కొత్త స్పీకర్'కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం అందించారు.

    ఈ క్రమంలోనే తెలంగాణ శాసనసభాపతిగా ఎన్నికైన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్ కుమార్ చరిత్ర లిఖించారు.

    ఇదే సమయంలో స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

    details

    సమాజంలోని ఎన్నో రుగ్మతలపై స్పీకర్ పరిష్కారం చూపాలి : సీఎం 

    స్పీకర్ ఎన్నికపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సభలో మంచి సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు.

    సభాపతి ఎన్నికపై సానుకూలంగా వ్యవహరించిన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

    భవిష్యత్'లోనూ ఇదే సాంప్రదాయం కొనసాగాలన్నారు. తనది, స్పీకర్'ది సొంత జిల్లా వికారాబాదేనని గుర్తు చేశారు.

    అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారని కొనియాడారు.

    సభలో చర్చలు ఫలప్రదమై సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. సమాజంలోని రుగ్మతలపై స్పీకర్ పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నామన్నారు.

    గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    స్పీకర్'ను పీఠంపై కూర్చుబెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

    #WATCH | Congress leader Gaddam Prasad Kumar unanimously elected as the Speaker of Telangana Assembly

    (Video source: Telangana Assembly) pic.twitter.com/rNJ1QKnOt7

    — ANI (@ANI) December 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై గవర్నర్
    తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్ తెలంగాణ
    తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది? తెలంగాణ బడ్జెట్
    తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే తెలంగాణ బడ్జెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025