NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నవంబర్ చివరికల్లా రైతు భరోసా
    తదుపరి వార్తా కథనం
    Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నవంబర్ చివరికల్లా రైతు భరోసా
    రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నవంబర్ చివరికల్లా రైతు భరోసా

    Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నవంబర్ చివరికల్లా రైతు భరోసా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 04, 2024
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. గత సంవత్సరం జరిగిన విధానాల ప్రకారమే, ఇప్పుడు ఒక్క ఎకరా నుండి ప్రారంభించి, ఐదు ఎకరాలు ఉన్న రైతులకు డిసెంబర్ నెలాఖరు వరకు నిధులు జమ చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

    దసరా తర్వాత రైతు భరోసా పంపిణీ చేయాలనే సంకల్పంతో ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది.

    అయితే, అప్పటికే రుణ మాఫీ కోసం రూ. 18 వేల కోట్లు రైతులకు విడుదల చేసింది. దీనితో పాటు మరికొన్ని సంక్షేమ స్కీములకు నిధులు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

    వివరాలు 

    స్థానిక ఎన్నికల కంటే ముందుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం

    దసరా నుండి రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇందుకు సంబంధించి, ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

    రైతుల విషయమై ప్రతిపక్షాలకు అవకాశమివ్వబోమని ఆయన చెప్పారు. డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికల కంటే ముందుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలనుకుంటున్నారు.

    ప్రతి 10 రోజులకు రూ. 1,500 కోట్లు నుండి రూ. 2,000 కోట్ల చొప్పున 45 రోజుల్లో కనీసం రూ. 7 వేల కోట్లు జమ చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

    దీని ద్వారా ఏడెనిమిది ఎకరాల రైతులకు, అంటే దాదాపు 96% మంది రైతులకు రైతు భరోసా అందించబడుతుంది.

    వివరాలు 

    రైతు భరోసా పై కేబినెట్ సబ్ కమిటీ

    అయితే, రైతు బంధు స్కీమ్‌లో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

    గత ప్రభుత్వ కాలంలో రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, భూసేకరణ కింద వృథాగా చెల్లించినట్లు వెల్లడించారు.

    2018 నుండి 2023 మధ్య రాళ్లకు, ఇతర భూములకు రూ. 25 వేల కోట్లు చెల్లించినట్లు గుర్తించారు.

    ఈ నేపధ్యంలో, రైతు భరోసా పై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, రైతుల అభిప్రాయాలను సేకరించారు.

    చాలామంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం సరిపోతుందని సూచించగా, మరికొంతమంది ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని కోరారు.

    ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది.

    వివరాలు 

    రైతుల ఖాతాల్లో 45 రోజుల్లో  నిధుల జమ 

    రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తెలిసిన నేపథ్యంలో, అవసరమైతే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకున్నప్పటికీ, శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ విదేశీ పర్యటనలో ఉన్నారు.

    ప్రభుత్వం, రైతుల ఖాతాల్లో నిధుల జమను 45 రోజుల్లో పూర్తిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి ఏకమొత్తంగా రూ. 1,500 కోట్ల నుండి 2,000 కోట్లు జమ చేయాలని యోచిస్తున్నది. అంతేకాక, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వనని ప్రభుత్వం నిర్ణయించింది.

    వివరాలు 

     పెట్టుబడి సాయం కోసం దాదాపు రూ. 7 వేల కోట్లు 

    దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

    రాష్ట్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుతున్నాయని, దుబారాను కట్టడి చేస్తే, పెట్టుబడి సాయం కోసం దాదాపు రూ. 7 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Operation Sindoor: యూపీలో 17 మంది నవజాత శిశువులకు 'సిందూర్' అని అని నామకరణం.. ఇది కదా దేశభక్తి అంటే.. ఉత్తర్‌ప్రదేశ్
    Kantara 2: కాంతార2 టీమ్‌లో విషాదం.. గుండెపోటుతో మ‌రొక‌ జూనియర్ ఆర్టిస్ట్ క‌న్నుమూత‌  కాంతార 2
    Road Accident in US: అమెరికా పెన్సిల్వేనియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి అమెరికా
    Operation Sindoor: జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..? జమ్ముకశ్మీర్

    తెలంగాణ

    Revanth Reddy: తెలంగాణ సాధనకు 'అలయ్‌ బలయ్‌' స్ఫూర్తి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి
    kaleshwaram judicial commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్‌! భారతదేశం
    Kaleshwaram Project: స‌వ‌రించేదాకా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల నింపొద్దు భారతదేశం
    Telangana Liquor Sales: వెయ్యి కోట్ల మందు విక్రయం.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025